
courts should not interfere in govt duties in ap
Government Duties : అది ఏ రాష్ట్రమైనా అక్కడి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల బాధలను పట్టించుకోవాలి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. ప్రాథమిక అవసరాలు తీర్చాలి. అదే ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం, ప్రజల మధ్య కోర్టులు దూరకూడదు. కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. అని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయవ్యవస్థకు ఒక పరిధి ఉంటుంది. ప్రతి విషయానికి న్యాయవ్యవస్థ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటేనే న్యాయస్థానాలు స్పందించాలి.
కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ సంబంధం లేని, సాధ్యం కాని పనులపై కూడా తప్పుడు తీర్పులు వస్తున్నాయన్నారు.ప్రజాస్వామ్యం అన్నింటికంటే ఉన్నతమైనది. దానికి విఘాతం కలిగించకూడదు. ఒకవేళ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే అప్పుడు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఉంటుంది. కానీ.. పాలన వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. దాని వల్ల ప్రభుత్వాలు మంచి పాలన అందించలేవు. పాలకులు కూడా ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి.
courts should not interfere in govt duties in ap
సామాన్యుడికి, కార్యనిర్వాహక వర్గానికి మధ్య న్యాయవ్యవస్థ ఒక వారధిలా ఉండాలని, పాలకులు కూడా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడే కోర్టులు స్పందించాలని, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వాలదే అని, సంబంధం లేని, సాధ్యం కాని పనులపై కూడా తప్పుడు తీర్పులు వస్తున్నాయని, కార్యనిర్వాహకవర్గంపై కొన్ని తీర్పులు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన అందిస్తేనే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని స్పష్టం చేశారు.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.