kejriwal
arvind kejriwal : కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రికల్ కార్లు బస్సులను ఉపయోగించాలంటూ ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. కాని ఇప్పటి వరకు కనీసం 1 శాతం వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించడం లేదు. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నా కూడా విద్యుత్ వాహనాల పట్ల ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మొదట ప్రజల్లో మార్పు రావడం కంటే మనమే ముందు మారుదాం అనుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఛారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ విభాగాలు అన్ని కూడా ఇకపై విద్యుత్ వాహనాలు వాడాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ అవసరాలకు వినియోగించే ప్రతి వాహనం కూడా విద్యుత్ వాహనంగా మార్చడం వల్ల చాలా వరకు కాలుష్యం తగ్గుతుంది. ప్రభుత్వ వాహనాలను విద్యుత్ వాహనాలకు షిప్ట్ చేయడం అనేది అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలుష్య నివారణ కోసం ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలను వాడాలంటూ మోడీ ప్రభుత్వం సూచనలు అయితే చేస్తుంది కాని ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేసిందే లేదు. ఇప్పుడు కేజ్రీ వాల్ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ ప్రకటన నిజంగా అద్బుతం అంటూ ఈ సందర్బంగా కేజ్రీవాల్ అభిమానులు అంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం కోరలు చాచింది. ఎంతో మంది పెద్ద ఎత్తున కాలుష్యం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రులు మరియు మంత్రులు ఇతర ప్రభుత్వ అధికారులు అంతా కూడా ఇలా విద్యుత్ వాహనాలను వాడటం వల్ల చాలా వరకు విద్యుత్ వాహనాల గురించిన అవగాహణ పెంచిన వారు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వాహనాలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలంటూ పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మొదటగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఉత్తమంగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని అభినందించడంతో పాటు తమ కేబినేట్ మంత్రులు అధికారులు సెక్యూరిటీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ వాహనాలను సమకూర్చితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.