
did operation mangalagiri start in ycp
Operation Mangalagiri : ఇంకో రెండేళ్లలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పలు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ అధినేత జగన్ కు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క టార్గెట్ టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీని తొక్కిపడేసి సీఎంగా గెలిచిన వైఎస్ జగన్, ఈసారి అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కునేలా పథకాలు రచిస్తున్నారట. ఇప్పటికే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఓడిపోయేలా పథకాలు రచించి సక్సెస్ అయ్యాడు జగన్. తాజాగా వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేశ్ ను ఓడించేందుకు వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. దానికోసమే ఆయన ఆపరేషన్ మంగళగిరిని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
ఓవైపు కుప్పం నియోజకవర్గంలోనూ ఈసారి చంద్రబాబును ఓడించేందుకు ప్లాన్స్ వేసిన జగన్.. మరోవైపు మంగళగిరిలోనూ లోకేశ్ ను ఓడించేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంపై ప్రస్తుతం అందరి చూపు పడటానికి కారణం రాజధాని అమరావతికి ఆ నియోజకవర్గం దగ్గరగా ఉండడం. రాజధానికి దగ్గరగా ఉండటంతో పాటు అక్కడ ఉన్న ఓటర్లలో ఎక్కువ శాతం పద్మశాలీ ఓట్లే ఉన్నాయి. పద్మశాలీ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కేవలం పద్మశాలీలను తమ వైపునకు తిప్పుకున్నా చాలు గెలపు ఎవరిదైనా సులువు అవుతుంది. అందుకోసమే.. పద్మశాలి నేత చిల్లపల్లి మోహన్ రావుకు ఆప్కో చైర్మన్ పదవిని వైఎస్ జగన్ కట్టబెట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మరో నేత మురుగుడు హన్మంతరావుకు ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు.
did operation mangalagiri start in ycp
ఇద్దరు పద్మశాలి నేతలకు పదవులు ఇవ్వడంతో కొంతమేర పద్మశాలి నేతలు తన వైపునకు తిరిగినట్టే. ఇది ఇలా ఉంటే టీడీపీకి చెందిన గంజి చిరంజీవి టీడీపికి రాజీనామా చేశాడు. ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీలోనూ చేరకున్నా.. ఆయన వైసీపలోనే చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూడా వైసీపీలో చేరితే ఇకేంముంది మంగళగిరి నియోజకవర్గం మరోసారి వైసీపీ చేతికి చిక్కినట్టే. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశాలు తక్కువే. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే.. గంజి చిరంజీవి వైసీపీలో చేరితే గంజికే వైసీపీ నుంచి మంగళగిరి టికెట్ దొరికే అవకాశం ఉంది. చూద్దాం.. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఉన్న ఒక ఆశను కూడా జగన్ మటుమాయం చేస్తారో చేయరో.
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
Gold Silver Rate Today 27 Feb 2026 : పసిడి ప్రేమికులకు ఇది నిజంగా అదిరే శుభవార్త అని…
This website uses cookies.