Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నాయకులు అయితే కొట్టుకునే స్థాయి, చంపుకునే స్థాయికి కూడా వెళ్లారు. తాజాగా కావలిలో అదే జరిగింది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నేతలు కొందరు పలు ప్రాంతాల్లో సృష్టిస్తున్న విద్వేషాలకు సంబంధించిన వార్తలను చూస్తూనే ఉన్నాం కదా. తాజాగా జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రణయ్ కుమార్ అనే వ్యక్తిని వైసీపీ నేతలు చంపేశారని చెబుతున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.
బలికిరి ప్రణయ్ కుమార్ తల్లిని కూడా పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలకుంట అనే గ్రామానికి చెందిన బలికిరి ప్రణయ్ కుమార్ ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేశాడు. అతడు జనసేనకు మద్దతుగా నిలవడమే కాదు.. తన గ్రామంలో ఉన్న సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు అధికార పార్టీతో పోరాటం చేస్తుండటంతో పలు సార్లు అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రణయ్ అధికార పార్టీపై పోరాటం చేయడం నచ్చని వైసీపీ నేతలు అతడు అడ్డుగా ఉన్నాడని చంపేసినట్టు తెలుస్తోంది.
నా బిడ్డను వైసీపీ వాళ్లు చంపేశారు. ఎవరు చంపారో కూడా ఆ తల్లి పవన్ కళ్యాణ్ కు చెప్పుకుంది. ఇంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ప్రణయ్ మాట్లాడిన వీడియో, తాజాగా పవన్ కళ్యాణ్ ప్రణయ్ తల్లితో మాట్లాడిన వీడియోను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రణయ్ కుమార్ డిగ్రీ చదివి ఆటో నడుపుకునేవారని, కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట గ్రామంలో ఎంపీటీసీ 1 నుంచి జనసేన తరుపున పోటీ చేశారని చెబుతూ పవన్ ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఆ తల్లి వేదనను చూసి సోషల్ మీడియాలో జనసేన అభిమానులు వైసీపీపై మండిపడుతున్నారు. ప్రణయ్ తల్లికి ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్.. ఆమె బాగోగులను తానే చూసుకుంటానని మాటిచ్చారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.