TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 September 2025,4:00 pm

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా బస్సుల్లో ప్రయాణించే వారికోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ డ్రాలో గెలిచిన విజేతలకు మొత్తం ₹5.50 లక్షల విలువైన బహుమతులు అందజేయనున్నారు.

#image_title

లక్కీ డ్రా నిర్వహణ తేదీలు

లక్కీ డ్రా కాలం: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 వరకు
డ్రా తేదీ: అక్టోబర్ 8
విజేతల ఎంపిక: ప్రతి రీజియన్‌లో ముగ్గురు చొప్పున మొత్తం 33 మంది విజేతలు

బహుమతుల వివరాలు (ప్రతి రీజియన్‌కు)

1. ప్రథమ బహుమతి: ₹25,000
2. ద్వితీయ బహుమతి: ₹15,000
3. తృతీయ బహుమతి: ₹10,000

మొత్తం బహుమతుల విలువ: ₹5,50,000

టీఎస్‌ఆర్టీసీకి చెందిన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్-ఏసీ, ఏసీ బస్సుల్లో ప్రయాణించాలి.ప్రయాణం పూర్తయ్యాక, టికెట్‌పై మీ పూర్తి పేరు, ఫోన్ నెంబర్ రాసి, బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేసాలి.రిజర్వేషన్‌తో ప్రయాణించిన వారు కూడా లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.సెప్టెంబర్ 27 – అక్టోబర్ 6 మధ్య చేసిన ప్రయాణాలే లెక్కలోకి తీసుకుంటారు. ప్రయాణికులు పెద్దఎత్తున ఈ లక్కీ డ్రాలో పాల్గొని, తమ పండుగకు మరింత ఆనందాన్ని చేకూర్చుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే మా లక్ష్యం,” అని ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.

Advertisement

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి