Dwarka Story : ద్వారక ఎలా మునిగింది ..? శ్రీకృష్ణుడి మరణం ఎలా జరిగింది..?

Advertisement
Published by
Advertisement

శ్రీకృష్ణుడు కంసుడిని చంపిన సంగతి తెలిసిందే. దీంతో కంసుడి ఇద్దరి భార్యలు హస్తి మరియు ప్రక్తి తమ తండ్రి జరాసంధుడు వద్దకు వెళ్లి తమ భర్తను చంపిన కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. దీంతో జరాసంధుడు కృష్ణుడిపై పగ పెంచుకుంటాడు. అప్పటినుంచి జరాసంధుడు కృష్ణుడు నివసిస్తున్న మధుర పై తన సైన్యంతో దండయాత్ర చేస్తూ ఉండేవాడు.

Advertisement

Dwarka Story ద్వారక నిర్మాణం

యుద్దాల కారణంగా ఎంతోమంది మధురా నగర ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కృష్ణుడు మొదటిగా మధుర నగర ప్రజలను కాపాడాలని ఆ తర్వాత జరాసంధుడి సంగతి తేల్చాలని అనుకుంటాడు. అప్పుడే సముద్రాన్ని కొద్దిగా భూమి అడిగి ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. మధురానగర్ ప్రజలను ద్వారకాకి తీసుకువెళతాడు. ద్వారకానగరంలో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. అలాగే ఈ నగరాన్ని వజ్రాలు, బంగారం, ముత్యాలు వంటి అపురూపమైన వాటితో నిర్మించారు. ఇక ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడే పాలించాడు. ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. దాదాపుగా 10 లక్షల మంది జనాభా ఉండేవారు. వారికి కావాల్సి సదుపాయాలని నగరంలో ఉండేవి. అప్పట్లో ఈ నగరాన్ని స్వర్ణ నగరం అనేవారు. ఇక జరాసంధుడు నుంచి ప్రజలకు ఆపద కలగకుండా శ్రీకృష్ణుడు భీముడిచే అంతం చేశాడు. అయినా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడిని వెంటాడటం మానలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకు అయినా శిశుపాలుడు శ్రీకృష్ణుడి పై పగతో ద్వారకాపై దండెత్తాడు. శ్రీకృష్ణుడు అతడిని అంతం చేశాడు. ఆ తర్వాత శిశుపాలుడు సోదరుడు సాల్వుడు శ్రీకృష్ణుడిని చంపేందుకు యత్నించాడు. అతడిని కూడా శ్రీకృష్ణుడు అంతం చేసాడు.

Advertisement

Dwarka Story గాంధారి శాపం

శిశుపాలుడు సాల్వుడిని అంతం చేసిన తర్వాత ద్వారకాకు శాపం తగిలింది. ఆ శాపం కౌరవుల తల్లి గాంధారిధి. ఆమె శపించడానికి గల కారణం ఉంది. పాండవులు, కౌరవుల మధ్య హస్తినాపురం సింహాసనానికి కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు తప్ప మిగతా 99 మంది చనిపోతారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరి తరపున శ్రీకృష్ణుని తటస్థంగానే ఉన్నాడు. నేను మరియు యాదవ సైన్యం ఈ రెండింటిలో మీరు ఒకదానిని కోరుకోండి అనగా పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడు సైన్యాన్ని కోరుకుంటారు. అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరుపున శ్రీకృష్ణుడు ఉన్నా కూడా కేవలం అర్జునుడు రథాన్ని నడిపాడు తప్ప యుద్ధానికి దిగలేదు. 18 రోజుల భీకర యుద్ధంలో పాండవులు గెలిచారు. యుద్ధం తర్వాత 99 మంది బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించడానికి శ్రీకృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు.

ఆమె కోపంతో నువ్వు నా బిడ్డలను కాపాడాలని ఏమాత్రం ఉద్దేశం ఉన్న ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే ఆపగలిగే వాడివి. ఎందుకు అలా చేయలేదని కృష్ణుడిని ప్రశ్నిస్తుంది. అప్పుడు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త దృతరాష్ట్రుడు గత జన్మలో ఒక హంస, దానికి పుట్టిన పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ కర్మ ఫలితము ఈ జన్మలో చూపు కోల్పోయాడు. అలాగే 100 మంది బిడ్డలను కోల్పోయాడు అని అంటాడు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన గాంధారి నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ. ఏ పాపం ఎరుగని నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారు అంటూ నువ్వు కూడా నాలాగే నీ పిల్లల్ని అంటే యాదవ ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమైపోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. ఇక గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె శాపం ఫలిస్తుందని కృష్ణుడికి తెలుసు. మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం మొదలైంది. గాంధారి శాపం ద్వారకా నగర అంతానికి కారణమైంది.

Dwarka Story మునుల శాపం

ఇదేకాక మరో శాపం కూడా వెంటాడిందని భారతం చెబుతుంది. నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుడిని చూడడానికి ద్వారకా కు వచ్చారు. ఆ సమయంలో ఆ మహర్షులను యాదవులు ఆటపట్టించారు. ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి కూతురు పుడుతున్న కొడుకు పుడుతుందా అని వాళ్ళు హేళనగా అడిగారు. దీంతో ఆ మునులంతా ఆవేశానికి గురై వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి కృష్ణుని కలవకుండానే వెనక్కి వెళ్ళిపోతారు. ఇలా ఈ శాపాలని ద్వారకా నగరాన్ని వెంటాడుతూ వచ్చాయి. సాల్వుడి అంతం, మునుల అవమానం, గాంధారి శాపం వలన యాదవులు వారిలో వారు పదవుల కోసం ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్న కృష్ణుడు చూస్తూ ఏమి చేయలేకపోయారు. సముద్రుడు ద్వారకాన్ని ముంచి వేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాడు. తన ముందు యాదవులు చంపుకోవడం, తన్నుకోవడం చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోయాడు. ఇక చివరికి అర్జునుడిని ద్వారకాకి పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను అడవులకు వెళ్ళిపోయాడు.

Lord Krishna శ్రీకృష్ణుడి మరణం

అడవిలో ఒకరోజు చెట్టుపై ఏకాంతంగా కూర్చుని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది. దీంతో కృష్ణుడు తనువు చాలించాడు అంటే మరణించాడు. అయితే ఆయన మరణం లోక కళ్యాణం కోసమే జరిగింది. ఇది శ్రీకృష్ణుడి అవతారానికి ముగింపు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు జరిపి మిగిలిన యాదవ స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకువెళతాడు.

Dwarka Story ద్వారకా అంతం

ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. ఉరుములు తోకచుక్కలు ద్వారకాపై కురిసాయి. సముద్రుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ద్వారకను తనలో కలుపుకుంది. ఇలా ద్వారకా నగరం కురుక్షేత్రం జరిగిన 31 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇక ఈ ద్వారక మునిగిన 2500 సంవత్సరాల తర్వాత ఇలా అరేబియన్ పశ్చిమ తీరంలో గోమతి అనే నది సముద్రంలో కలిసే చోట సముద్రం కింద ఒక నగరం ఉందనే విషయం కొన్ని అవశేషాలు దొరకటం ద్వారా మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. సముద్రంలో బయటపడ్డ ఆ నగరం ద్వారకా నగరం అని చారిత్రకులు చెప్పారు.

Advertisement

Recent Posts

Health : ఇది పిచ్చి మొక్క కాదు .. సంజీవనితో సమానం .. వంద అనారోగ్య సమస్యలకు చెక్..!

Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…

14 minutes ago

Gold : ఇప్పటికిప్పుడు బంగారం కొంటే ఎంత లాభం వస్తుందో తెలుసా?

Gold  : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…

10 hours ago

Harsha Veena : బిగ్ బ్రేకింగ్ : హర్ష వీణ ని కలవబోతున్న పవన్ కళ్యాణ్ ?

Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…

11 hours ago

RK Roja : BIG BREAKING.. వైసీపీ నుంచి రోజా సస్పెండ్ ?

RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…

12 hours ago

Prabhas vs Dhurandhar :ప్రభాస్ ఫ్యాన్స్ కి నమ్మలేని బ్యాడ్ న్యూస్ ఇచ్చిన ధురంధర్

Prabhas vs Dhurandhar  : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…

13 hours ago

Students : బ్రేకింగ్‌.. ఏపీ విద్యార్ధులకి ప్రభుత్వం ఎగిరి గంతేసే గుడ్ న్యూస్..!

Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…

14 hours ago

Viral video : విరాట్ కోహ్లీపై వల్ల గర్భవతిని అయ్యాను .. బేబీ బంప్ చూపిస్తూ వీడియో షేర్ చేసిన యువతి ..!

Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…

15 hours ago

IPL 2026 : బెట్టింగ్ ఊబిలో పడొద్దు .. బతుకును ఛిద్రం చేసుకోవద్దు .. సజ్జనార్ హెచ్చరిక ..!

IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…

16 hours ago

LPG Gas : వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా? .. అయితే ఇలా చేయండి ..వెంటనే సిలిండర్ డెలివరీ .. !

LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…

17 hours ago

IPL 2026 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ .. మ్యాచులకు దూరంగా ధోనీ .. ఎందుకో తెలుసా ..?

IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…

18 hours ago

Ration Card : రేషన్ కార్డుదారులకి శుభవార్త .. మూడు నెలల కోటాకు సర్వం సిద్ధం .. కానీ !

Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…

19 hours ago

EPFO : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ .. ఇక పై ఏటీఎం ద్వారా సెకన్లలోనే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు .. వివరాలివే ..!

EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…

20 hours ago