AP Early Elections : ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయా? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల గురించి ఎందుకు చర్చ నడుస్తోంది. ఏపీలో ఎందుకు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. అసలు దాని గురించి ఎందుకు చర్చ నడుస్తోంది అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ముందే ఎన్నికల హడావుడి ఎందుకు మొదలవుతోంది. అసలు ముందస్తు ఎన్నికల గురించి ఎంత చర్చ నడుస్తోంది. దానికి కారణం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో కాకుండా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి వైఎస్సార్సీపీ పార్టీ సమాయత్తం అవుతోందట.
ఎందుకంటే ప్రస్తుతం అధికారం వైసీపీ చేతుల్లో ఉంది. దీంతో వైసీపీ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. అసెంబ్లీని డిస్సాల్వ్ చేస్తుంది. దీంతో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సిందే. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికల అంశాన్ని అంత ఈజీగా మనం కొట్టిపారేయలేం.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రోజులు ఏపీ సీఎం వైఎస్ జగన్ కేవలం ప్రజా సంక్షేమం మీద, పథకాల మీద, ఏపీ రాజధానులు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు. కానీ.. ఇప్పుడు వైఎస్ జగన్ పూర్తిగా వచ్చే ఎన్నికల మీద ఫోకస్ పెట్టారట.
ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తేనే కదా.. అధికార పీఠం ఎక్కేది. అందుకే.. ఎక్కడికెళ్లినా.. ఏం మాట్లాడినా తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెబుతున్నారు. ఇంకా గెలిపిస్తే ఏం చేస్తామో కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. నిజంగానే ఎన్నికలు వస్తే ఇతర పార్టీలు కూడా సమాయత్తం అవ్వాలి కదా. అందుకే.. ఇతర పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడే అన్నట్టుగా సిద్ధం అవుతున్నాయి. అందుకే టీడీపీ పార్టీ అధినేత కూడా జిల్లాలను పర్యటిస్తున్నారు. కార్యకర్తలను యాక్టివేట్ చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. చూద్దాం మరి.. నిజంగానే వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక 2024 వరకు ఆగుతారా? అనేది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.