EGG | డ‌యాబెటిస్ ఉన్న‌వారు గుడ్డు తింటే ఏమ‌వుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారు?

Authored By Sam C | The Telugu News | Updated on : 17 October 2025, 7:28 am

EGG | గుడ్లలో పుష్కలమైన పోషకాలు ఉండటం వల్ల వాటిని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. సులభంగా అందుబాటులో ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో లభించే గుడ్లు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైన ఆహారంగా నిలిచాయి. కేవలం రెండు నిమిషాల్లో వండుకోవచ్చన్న సౌలభ్యం, అనేక రకాల వంటకాలకు ఉపయోగపడే లక్షణం గుడ్లను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది.

#image_title

ఏం చెబుతున్నారు..

ఆరోగ్య నిపుణుల ప్రకారం గుడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కలిగి ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి గుడ్లు తినడం ఎంతో ప్రయోజనకరమని చెబుతున్నారు. వారానికి నాలుగు గుడ్లు తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నాలుగు కంటే ఎక్కువ గుడ్లు తినడం వల్ల అదనపు ప్రయోజనం ఉండదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుడ్లు తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం ప్రమాదం తగ్గి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుడ్లలోని ప్రోటీన్లు, విటమిన్ D, మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు మెటబాలిజం, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉదయాన్నే గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించి, షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మధుమేహం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. దీన్ని పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి