Eluru District : ఏలూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్దినినీ బంధించి వేడి నూనెతో చిత్రహింసలు.. వీడియో

Authored By Breaking News | The Telugu News | Updated on : 25 April 2023, 10:00 am

Eluru District : దేశంలో మహిళలపై దాడులు ఉన్నా కొద్ది పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త చట్టాలు వస్తున్నా గానీ.. మహిళలపై దాడుల విషయంలో సమాజంలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. మరి దారుణంగా మహిళలను చంపుతూ ఉన్నారు. లైంగిక వేధింపులు అత్యాచారాలు ప్రపంచంలో ఎక్కువగా భారతదేశంలోనే జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఓ విద్యార్దిని అత్యంత కిరాతకంగా దారుణంగా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ప్రియాంక అనే అమ్మాయి కాకినాడలో బీటెక్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన అనుదీప్.. దాదాపు ఏడాది నుండి ఆమెను ప్రేమిస్తూ వెంట పడటం జరిగింది. చివరకు ఆమెను ట్రాప్ చేసి.. కాకినాడ కాలేజీ నుండి రహస్యంగా తన ఇంటికి పిలిపించుకుని ఐదు రోజులపాటు ఇంటిలో నిర్బంధించి.. ప్రియాంకను చిత్రవాదులకు గురి చేయడం జరిగిందట. ఈ క్రమంలో అర్ధరాత్రి ఆమె చేతిపై నూనెతో కాల్చేయడం జరిగిందట.

Eluru District Video of BTech student being captured and tortured in hot oil

Eluru District Video of BTech student being captured and tortured in hot oil

ఇలా చిత్రవాదులు అనుభవించిన ప్రియాంక ఒకరోజు అర్ధరాత్రి అనుదీప్ నిర్బంధించిన గది నుండి తప్పించుకుని.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి తప్పించుకోవటం జరిగింది. దీంతో వెంటనే ఆమెను తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అనుదీప్ అనే వ్యక్తికి డ్రగ్స్ అలవాటుతో పాటు అమ్మాయిలను ట్రాప్ చేసే అలవాటు ఉందని టాక్. దీంతో పోలీసులు అనుదీప్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

https://youtu.be/ZaUUtUWbM8M

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp