Epfo : ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలోనే ఓ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి మినిమమ్ పెన్షన్ పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చల ఫలితంగా ఈ అంశంపై త్వరలోనే ఈపీఎఫ్ఓ తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం కలుగనుందని అంటున్నారు.తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల కనీస పెన్షన్ ను రూ. 1000 నుంచి 9 వేల రూపాయలకు పెంచనునుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో జరగనున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో… ఈ కనీస పెన్షన్ పెంపు అంశంపై చర్చ జరగవచ్చునని అంటున్నారు. ఉద్యోగుల ఎప్పటినుంచో ఈ కనీస పెన్షన్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఖాతాదారులకు కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదనలపై ఫిబ్రవరిలో… కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జరపనున్న చర్చల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ కనీస పెన్షన్ పెంపు పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత 2021 మార్చిలోనే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెంచాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
పదవీ విరమణకు ముందు చివరి నెలలో ఉండే శాలరీని బట్టి… ఈ పెన్షన్ను ఫిక్స్ చేయాలని ఎంతో కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ విషయంలో అంత సముఖంగా లేనట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద ప్రావిడెంట్ ఫండ్ పొందే సబ్స్క్రయిబర్లందరికీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 అందుబాటులో ఉంటుంది. ఉద్యోగులకు 58 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుండగా.. వారు కనీసం పదేళ్ల పాటు తప్పనిసరిగా ఆ ఉద్యోగంలో ఉండి తీరాలి. ఈ స్కీమ్ కింద, ఎంప్లాయీ పేరు మీద 12 శాతం మొత్తాన్ని ఎంప్లాయర్ ఈపీఎఫ్లో జమ చేయాలి. దీంతో ఉద్యోగులు 58 ఏళ్ల తర్వాత వెయ్యి రూపాయిలు మినిమమ్ పెన్షన్ పొందుతున్నారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.