father writes property worth rs 2 crore to district collector
Father : ప్రస్తుత సమాజంలో పిల్లలు తమ పేరెంట్స్ను పట్టించుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తిండి పెట్టకుంట వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఇంట్లోంచి గెంటివేస్తు్న్నారు. ఆస్తుల కోసం కన్న తల్లితండ్రులను, తోడబుట్టిన వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తుల కోసం ఏకంగా రక్త సంబంధీకులను సైతం చంపడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలకు సంబంధించిన విషయాలను మనం రోజూ వార్త కథనాలు, సోషల్ మీడియా ద్వారా చూస్తునే ఉంటాం. తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొడుకులతో విసిగిపోయిన ఓ తండ్రి రూ.2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ పేరిట రాసి షాకిచ్చాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. ఆగ్రాలోని నీరాలాబాద్ పీపల్మండికి చెందిన గణేశ్ శంకర్ పాండే (88)కు ఇద్దరు కుమారులు. ఈయన సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో తన సోదరులతో విడిపోయాక ఇతని వాటాగా 225 చదరపు గజాల స్థలం వచ్చింది. ప్రస్తుతం దీని విలువ రూ.2 కోట్లు.. అయితే, తండ్రి వద్ద ఉన్న ఆస్తి కోసం తన ఇద్దరు కుమారులు కొట్టుకోవడం ప్రారంభించారు. పెద్ద కుమారుడు దిగ్విజయ్ తండ్రికి చెందిన ఆస్తిలో తనకే అధిక భాగం రావాలని తరచూ గొడవ చేస్తుండేవాడు. శంకర్ పాండే ఎంత నచ్చజెప్పాలని చూసిన అతను వినేవాడు కాదు.దీంతో విసుగు చెందని పెద్దాయన షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
father writes property worth rs 2 crore to district collector
పెద్ద కుమారుడి వద్దే ఉంటున్న శంకర్ పాండే కొడుకు పెట్టే టార్చర్ భరించలేక తిరిగి తన సోదరులు రఘునాథ్, అజయ్ల వద్దకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తనకు వాటాగా వచ్చిన 225 చదరపు గజాల భూమని జిల్లా కలెక్టర్ ఏకే సింగ్ పేరిట రాశారు. అందుకు సంబంధించి ఫార్మాలిటిస్ మొత్తం పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏకే సింగ్కు అప్పగించారు. దీంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. తన కుమారులకు బుద్ది చెప్పేందుకే ఇలా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు శంకర్ పాండే..
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…
Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
This website uses cookies.