YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటుచేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ నీ ప్రారంభించారు. అనంతరం ఆ యూనిట్ లో పర్యటించి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థకు అభినందనలు తెలియజేశారు. ఈ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ వల్ల వేలాది మంది రైతులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. దాదాపు ₹200 కోట్లతో 6.2 ఎకరాల స్థలంలో ఈ సంస్థను నిర్మించడం జరిగింది.
సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా.. ఈ పార్క్ నీ ఐటీసీ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. యూనిట్ వల్ల దాదాపు 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు రెండో దశ యూనిట్ నీ ఏర్పాటు చేయడానికి ఐటిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని రాష్ట్ర రైతులను చెయ్యి పట్టి ముందుకు నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకొందని పేర్కొన్నారు. ఇంకా రైతు భరోసా కేంద్రాల విధానం ద్వారా రైతుల జీవితాల్లో మరింత మార్పును తీసుకురావడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల నుండి దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్థానంలో నిలిచిందని సీఎం జగన్ గర్భంగా తెలియజేశారు. అంతేకాదు 3450 కోట్ల రూపాయలతో ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు వల్ల 33,000 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరమని స్పష్టం చేశారు. రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని.. ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారమందుతుందని పేర్కొన్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.