Bank Employees : గుడ్ న్యూస్… బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెంపు… ఎంతో తెలుసా..?

Authored By Ramu | The Telugu News | Updated on : 9 March 2024, 7:00 pm
  •  Bank Employees : గుడ్ న్యూస్... బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెంపు... ఎంతో తెలుసా..?

Bank Employees : చాలామంది ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్ వారు గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న జీతాల పెంపుకు అంగీకారం వచ్చింది. ఇక దానివల్ల దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం అందుతుంది.జీతాల పెంపును సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ బ్యాంక్ యూనియన్ల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో బ్యాంకు ఉద్యోగులు సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు ప్రస్తుతం 11వ వేతన ఒప్పంద 2022 నవంబర్ 1తో ముగిసింది. శాలరీల పెంపుపై ఏకాభిప్రాయానికి రావడానికి ఉద్యోగ సంఘాలు ఐబీఏ మధ్య అప్పటినుంచి చర్చలు నడుస్తున్నాయి.

ప్రస్తుతం చర్చలు ఫలించాయి. కావున ఈ శాలరీ పెంపు 2024 నవంబర్ 1 నుంచి అమలవుతుంది. దీనివల్ల ప్రభుత్వం రంగా బ్యాంకులపై వేటరు 8.20 కోట్ల అదనపు భారం పడబోతుంది.
వారానికి ఐదు రోజులు పని పై నిర్ణయం:ప్రస్తుతం బ్యాంకులకు నెలలోని అన్ని ఆదివారాలు ప్లస్ రెండు నాలుగు శనివారాలు సెలవులు మొదటి మూడో శనివారం లో పని చేస్తున్నారు. ఈ ప్రకారంగా బ్యాంకు ఉద్యోగులకు నెలలు సెలవులు వస్తున్నాయి. దీనికి ఎనిమిది వీక్లీ ఆకులకు పెంచాలని బ్యాంకు యూనియన్లు ఎప్పటినుంచో కోరుతున్నారు.

నెలలోని అన్ని ఆదివారాలతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా మార్చుకోవడానికి ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్కు ఒప్పుకున్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వారానికి ఐదు రోజులు పని విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.. ఇక బ్యాంకు ఉద్యోగుల జీతాన్ని 17 శాతం పెంపు అని నిర్ణయం తీసుకునే ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేట్ చైర్మన్ ఏకే గోయల్ ప్రకటన ఇచ్చారు. తదుపరి సమీక్ష 2027 నవంబర్లో ఉంటుంది..

Advertisement

Ramu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి