
Good news for AP farmers Subsidized machinery to reduce labour
Good News : ఏపీలో ప్రభుత్వం రైతుల కోసం పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు.. పనులు తొందరగా చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. అద్దె ప్రాతిపదికన వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనులకు సాయం అందిస్తోంది. అలాగే కమ్యూనిటీ హైరింగ్ పద్ధతిలో ట్రాక్టర్లు, యంత్రపరికరాలను అందిస్తోంది. తాజాగా యంత్ర పరికరాలను రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు ఎలాంటి పరికరాల అవసరం ఉందో గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది.
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి 20 మంది చొప్పున రైతులను ఎంపిక చేసిన ప్రభుత్వం మొత్తం లక్షా 80వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిచింది. వీరిలో అత్యధికంగా 34శాతం మంది పురుగు ముందులు చల్లేందుకు స్ప్రేయర్లు కావాలని కోరారు. 25 శాతం మంది టార్పాలిన్లు, 15శాతం మంది భూమిని చదును చేసేందుకు కల్టివేటర్ల వంటి పరికరాలు కావాలన్నారు. 12 శాతం మంది.. సెల్ప్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ 9 శాతం మంది రోటోవేటర్స్, 4 శాతం మంది సీడింగ్ పరికరాలు ఒక శాతం మంది మిస్క్ ఎక్విప్మెంట్ కావాలన్నారు. దీంతో ఈ పథకానికి ప్రభుత్వం మొత్త రూ.403 కోట్లు ఖర్చు చేయనుంది. ఏపీ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ.403 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలోనే రూ.6లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు నెలకొల్పనుంది.
Good news for AP farmers Subsidized machinery to reduce labour
వరి ఎక్కువ పండించే ప్రాంతాల్లో రూ.10 లక్షల సబ్సిడీతో రూ.25లక్షలు విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన 1,615 క్లస్టర్ లెవల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల వ్యయంతో 6,781 రైతు భరోసా కేంద్రాలు, 391 క్లస్టర్ లెవల్ యంత్రసేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవలై రైతు రథం పేరుతో రూ.175 కోట్లతో రూ.3,800 ట్రాక్టర్లను రైతులకు అందించిన ప్రభుత్వం అదనంగా ఈ యంత్ర పరికరాలను కూడా అందించనుంది. ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం గ్రామానికి 25 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఆరవై ఎనిమిది వేల మందిని ఎంపిక చేసి రూ.15వేల విలువైన వ్యవసాయ యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే గ్రామానికి 8 మంది చొప్పున మొత్తం ఎనబై వేల మందికి రూ.50 వేల విలువైన రెండు యూనిట్లను 50 శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నారు.
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
This website uses cookies.