Telangana : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన రాజకీయ జోస్యం చెప్పారు. తెలంగాణలో రానున్న రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పారయన. ప్రస్తుతం బీజేపీలో వున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిచి, కేసీయార్ మంత్రి వర్గంలో కీలకమైన మంత్రిగా పదవి నిర్వహించిన ఈటెల రాజేందర్ అనూహ్యంగా కేసీయార్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి గెలిచారాయన. అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాస్తా, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అయ్యారు. కానీ, బీజేపీలో నిలదొక్కుకోవడం ఒకింత కష్టంగా మారింది ఈటెల రాజేందర్కి.
ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కన్నేశారు. కేసీయార్ని ఓడించకపోతే, తన రాజకీయ జీవితానికే అర్థం లేదన్నట్లు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అందర్నీఆశ్చర్యపరుస్తున్నారు. ఒకప్పుడు ఇదే ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుని దేవుడిగా కొలిచిన సంగతి తెలిసిందే. రాజకీయాలు అలాగే వుంటాయ్ మరి.!కాగా, తెలంగాణలో ఆరు ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ఈటెల రాజేందర్ చెప్పిన జోస్యం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సహా, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో వున్నారని ఈటెల రాజేందర్ అంటున్నారు.
బాహుశా ఎక్కుమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగాలంటూ, బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్కి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించిందేమో.! తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితిని కాదని, భారతీయ జనతా పార్టీలో గులాబీ నేతలెవరూ చేరే అవకాశం వుండదు ఇప్పట్లో. ఎన్నికలు సమీపిస్తే, అప్పుడు రాజకీయాలు మారొచ్చు. రాజకీయ ఆలోచనలు భిన్నంగా వుండొచ్చు కూడా. ఆరు స్థానాలకు ఉప ఎన్నికలంటే, అంత సీన్ వుండకపోవచ్చని ఈటెల రాజేందర్కి తెలియదా.? ఆ పరిస్థితే వస్తే, కేసీయార్ ముందస్తు ఎన్నికలకే వెళతారు కదా.? కేసీయార్ గురించి అన్నీ తెలిసీ, ఈటెల రాజేందర్ ఇంత తేలికపాటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారబ్బా.?
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.