ఏపీ ప్రభుత్వం నేడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్ట బోతోంది. అగ్రవర్ణ మహిళల సంక్షేమమే ధ్యేయంగా.. వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రూపకల్పన చేసిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నేడు ప్రారంభించనున్నారు. నేడు వర్చువల్గా జరగనున్న ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నారు.
ఇక ఈ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం అర్హులైన మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలను ఆర్థిక సాయంగాజమ చేయనుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులుకాగా.. రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్య వైశ్య, వెలమ.. ఇతర అగ్ర కులాల మహిళలలు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందనున్నారు.
ఇలా రాష్ట్రంలోని మొత్తం 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఇక మేనిఫెస్టోలో ముందుగా ఈ పథకాన్ని పెట్టకపోయినా… రాష్ట్రం లోని అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు ఆర్థిక భరోసాగా నిలవడానికి తనవంతు సాయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.