Health Tips | ఆరోగ్యకరమైన భోజనం ఎన్ని సార్లు చేయాలి.. నిపుణులు ఏమంటున్నారు?

Authored By Sam C | The Telugu News | Updated on : 14 October 2025, 7:30 am

Health Tips | హెల్తీగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి అన్న ప్రశ్న మాత్రం చాలామందికి సందేహం ఏర్పరుస్తుంది. కొందరు ఒకసారి, మరికొందరు రెండు లేదా మూడు సార్లు భోజనం చేయడం ఉత్తమమని అనుకుంటారు. కానీ ఏది నిజంగా ఆరోగ్యకరమో? ఈ ప్రశ్నకు నిపుణులు వివరణ ఇచ్చారు.

#image_title

సమతుల్య భోజనం మాత్రమే కీలకం

సమతుల్య భోజనం అంటే శరీరానికి అవసరమైన పోషకాలు – ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు – అన్ని ఉండేలా చూసుకోవడం. అలాగే, ప్రభావవంతమైన జీవక్రియను కొనసాగించడానికి రోజుకు 2 నుండి 3 సార్లు భోజనం చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయడం బాగా నష్టం. ఉదయం ఆహారం ముఖ్యమైనది, ఎందుకంటే ఇది శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. పొట్టను ఆకలితో ఎక్కువసేపు ఉంచకండి. అలా చేస్తే శరీరంలో మంటల వల్ల మీకు మరింత ఆకలి ఏర్పడుతుంది.

కొంతమంది బరువు తగ్గడానికి రోజుకు ఒక్కసారిగా ఎక్కువ‌గా తినే పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఇది, జీవక్రియకు నష్టం కలిగించవచ్చు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సరిపడా అందకపోవచ్చు. అలాగే, మధుమేహం ఉన్న వ్యక్తులకు కూడా ఈ పద్ధతులు అనారోగ్యకరంగా మారవచ్చు. పండ్లు, నట్స్, లేదా క్యారెట్లు వంటి చిన్న స్కిల్స్ కూడా తినడం మర్చిపోకండి.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి