Epass Telangana : లాక్ డౌన్ టైమ్ లో ట్రావెల్ చేయడానికి ఈ పాస్ కావాలంటే ఏం చేయాలి? ఎలా అప్లయి చేయాలి?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 12 May 2021, 2:37 pm

Epass Telangana : తెలంగాణలో ఈ రోజు నుంచి అంటే మే 12 నుంచి లాక్ డౌన్ అమలులో ఉండనుంది. మే 12 నుంచి మే 22 వరకు లాక్ డౌన్ ఉండనుంది. కేవలం ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే బయటికి వెళ్లి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలి. మిగితా సమయాల్లో బయటికి వెళ్లడానికి వీళ్లేదు. ఉదయం 6 నుంచి 10 వరకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు కానీ.. ఉదయం 10 దాటితే మాత్రం ప్రయాణం చేయడానికి వీలు లేదు. ఉదయం 10 దాటగానే ఎక్కడివాళ్లు అక్కడే ఇంట్లోకి వెళ్లిపోవాలి. ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అయితే.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో బయటికి వెళ్లాలనుకునేవాళ్లు, వేరే ఊళ్లకు వెళ్లేవాళ్లు మాత్రం.. సంబంధింత ఈపాస్ ను తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వేరే జిల్లాలకు వెళ్లాలన్నా.. వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఖచ్చితంగా ఈపాస్ ఉండాల్సిందే.

how to apply for epass in telangana during lockdown

how to apply for epass in telangana during lockdown

ఈ పాస్ విధానం ద్వారా.. వేరే ప్రాంతాలకు వెళ్లే వాళ్లకు ప్రత్యేక పాసులను ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తెలంగాణ పోలీస్ శాఖ జారీ చేస్తుంది. https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ ఈ పాస్ కోసం అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సడలింపు సమయంలో కాకుండా.. ఇతర సమయాల్లోనూ ప్రత్యేక పాసుల సాయంతో ప్రయాణించవచ్చు.

ఇతర రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు, ఇతర జిల్లాలకు వెళ్లే వాళ్లకు.. వాళ్ల ప్రాంతాలకు చెందిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాస్ లను జారీ చేస్తారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాళ్లకు.. ఆయా రాష్ట్రాల నుంచి పాస్ తీసుకొని తెలంగాణలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సంబంధిత రాష్ట్ర పాస్ లేకుండా తెలంగాణలో అడుగుపెడితే.. పోలీసులు తెలంగాణలోకి రానివ్వకుండా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Epass Telangana : లాక్ డౌన్ సడలింపు సమయంలో ఎటువంటి పాస్ అవసరం లేదు

లాక్ డౌన్ సడలింపు అయిన ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు ఎటువంటి పాస్ అవసరం లేకుండానే ప్రయాణం చేయొచ్చని పోలీసులు తెలుపుతున్నారు. వేరే ప్రాంతానికి ప్రయాణించాలనుకునే వాళ్లు.. ప్రస్తుతం వాళ్లు ఉన్న ప్రాంతంలో ఏ కమిషనరేట్ పరిధికి వస్తుందో ఆ కమిషనరేట్ నుంచే పాసులను జారీ చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా.. బయటి రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఖచ్చితంగా పైన పేర్కొన్న వెబ్ సైట్ ద్వారానే అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈపాస్ ను జారీ చేస్తారు. ఈ పాస్ ను ప్రయాణం చేసేటప్పుడు దగ్గర పెట్టుకొని.. పోలీసులు అడిగితే చూపించాల్సి ఉంటుంది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  2. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  3. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

  4. "NCC Army Jobs : అమ్మాయిలకు గుడ్ న్యూస్.. NCC ‘C’ సర్టిఫికెట్‌తో నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు"

  5. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  6. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  7. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి