
How to make Mandi Biryani at home very easily
Mutton Mandi : బిరియానీలలో ఎన్నో రకాల బిర్యానీలు ఉంటాయి. బిర్యానీ అంటే రెస్టారెంట్ లోనే ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందరూ ఇంట్లో కూడా ట్రై చేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా వినిపించే పేరు మందీ బిర్యాని.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దీనిని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ బిర్యానీని కూడా మనం ఇంట్లోనే ఈజీగా, తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా.. అయితే దీనికి ఏమేమి కావాలో, అలాగే తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి.. ఈ మందీ బిర్యానికి కావాల్సిన పదార్థాలు: 1) మటన్ పెద్ద మొక్కలు 2) జీలకర్ర 3)యాలకులు 4)లవంగాలు5) సొంటి6) ఒక బిర్యానీ ఆకు7) ధనియాలు 8)మిరియాలు 9)నిమ్మకాయ 10)జీడిపప్పు,11) బాదంపప్పు, 12)దాల్చిన చెక్క13) జాపత్రి ఆకు14) కిస్ మిస్ లు15) ఉల్లిపాయలు16) అల్లం వెల్లుల్లి పేస్ట్ 17)నూనె 18)నెయ్యి19) బాస్మతి రైస్ 20) పసుపు 21) ఉప్పు మొదలైనవి.
తయారీ విధానం: ముందుగా ఒక ఆఫ్ కిలో రైస్ ను తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ముందుగా బాండీ పెట్టుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని, దానిలో జీడిపప్పు బాదం కిస్మిస్లు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.తర్వాత అదే ఆయిల్లో ఆఫ్ కేజీ మటన్ ముక్కలు వెయ్యాలి. వాటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంతలో ఒక మిక్సీ జార్ లో నాలుగు లవంగాలు, నాలుగు యాలకులు, కొన్ని మిరియాలు, ఒక సొంటి ముక్క, రెండు స్పూన్ల ధనియాలు, నాలుగైదు దాల్చిన చెక్క ముక్కలు, వేసి పౌడర్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై అవుతున్న మటన్ ముక్కలలో ఈ పౌడర్ ని కొంచెం వేసుకుని, బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో అర లీటరు నీళ్లను వేసుకొని, కొంచెం పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. దానిని దింపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బండి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి దాన్లో సన్నని ఉల్లిపాయ ముక్కలను వేసి, దాంట్లో రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి, ఎర్రగా వేయించుకోవాలి.
How to make Mandi Biryani at home very easily
తర్వాత దానిలో ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ని వాటర్ లోంచి తీసి ఈ బౌల్లో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఎర్రగా వచ్చేవరకు, తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్ ఉడకబెట్టిన నీరు ఆ నీటితోనే మనం రైస్ ను వండుకోవాలి. ఆ వాటర్ లో ముందుగా నానబెట్టుకున్న రైస్ ను వేసి అలాగే ఉప్పు కూడా వేసి70% ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఫ్రై చేసిన మటన్ ముక్కలను తీసి ఆ రైస్ పైన పెట్టుకోవాలి. ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత రైస్ మధ్యలో ఒక చిన్న గిన్నెను ఉంచి, బొగ్గుని తీసుకొని ఆ గిన్నెలో పెట్టాలి. దానిపైన కొంచెం నెయ్యిని అలాగే లవంగాల పొడిని వేసి అలాగే ఆ రైస్ పైన జీడిపప్పులు, కిస్ మిస్ లను, బాదంపప్పులు చల్లుకొని, ఆ గిన్నెపైన అల్యూమినియం పేపర్ పెట్టి, దానిపైన మూతన పెట్టి ,ఒక పది నిమిషాలు ఉంచాలి. తరువాత స్టవ్ ఆపి ఒక పది నిమిషాల వరకు అలాగే ఉంచాలి. తర్వాత దానిని తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా ఇంట్లోనే మందీ బిర్యాని రెడీ..
India and Iran Issue : అండమాన్ నికోబార్ దీవులు భారత దేశ భవిష్యత్తును మార్చేయబోతున్నాయి. సాధారణంగా ఎక్కడ యుద్ధం…
Indiramma Indlu Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సొంతింటి కలను సాకారం చేసే…
Botsa Satyanarayana : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి గడ్డు కాలం మొదలైనట్లు…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ…
Iran and Russia : ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.…
Bengal Elections 2026 : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైన…
Gold Silver Rate 4th April 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…
Karthika Deepam 2 April 4th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ 'కార్తీక…
Coconut Water : ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్లు మొదటి వరుసలో…
Chanakyaniti : ఆచార్య చాణక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త మరియు అర్థశాస్త్ర కోవిదుడు. ఆయన రాసిన చాణక్య నీతి నేటి…
Telangana Farmers : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త…
Gas Cylinder Offer: వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం. కానీ ఆ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ముడిసరుకులే దొరకకపోతే ఆ…
This website uses cookies.