YS Sharmila తెలంగాణా Telangana వైఎస్సార్టీపీ Ysrtp అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయాయి. త్వరలో జరిగే ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఒకవైపు కేసీఆర్, మరోవైపు ఈటల రాజేందర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని చాటుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫుల్లు జోరుమీదున్నాయి. ప్రధాన పార్టీలు ఇంత హడావుడిగా ఉండగా మరి మిగిలిన పార్టీలు ఏమి చేస్తున్నాయి ? ఏమి చేస్తున్నాయంటే కేవలం ఉనికికోసం నానా అవస్తలు పడుతున్నాయి.
మిగిలిన పార్టీలను వదిలిస్తే వైఎస్సార్టీపీ Ysrtp అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్ధితే మరీ అయోమయంగా తయారైంది. అసలా పార్టీ గురించి పట్టించుకుంటున్న వారే కనబడటంలేదు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, వెంటనే ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో దీక్షలు చేసిన ఆమె ఈరోజు మహబూబ్ నగర్ లో నిరాహారదీక్షకు రెడీ అయ్యారు. గూడూరు మండలంలోని గుండెంగ గ్రామాన్ని తన దీక్షకు షర్మిల వేదికగా చేసుకున్నారు. ఇదేసమయంలో ప్రధాన పార్టీలన్నీ దళితబంధు పథకం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పథకాన్ని కేసీయార్ హడావుడిగా ప్రారంభించటానికి కారణమైన హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు కాక మీద ఉన్నాయి..
అయితే వైఎస్ షర్మిల మాత్రం హుజూరాబాద్ బైపోల్ పై కనీసంగానైనా స్పందించకపోవడంతో ఆమె పార్టీని అందరూ లైట్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం దళితబంధు పథకం గానీ, బైపోల్ గానీ తనకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికతో పేదలకు ఒరిగేదేం లేదని, పోటీ చేయడం లేదని ప్రకటించడంతో వైఎస్ఆర్టీపీ పై సెటైర్లు చెలరేగాయి.. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరైనా నిరుద్యోగి పోటీచేస్తే సహకరిస్తామనే ఓ ప్రకటన ఇచ్చేసి ఊరుకున్నారు. ఇక ఉపఎన్నికలో ఎలాగూ పోటీచేసేది లేదుకాబట్టి దళితబంధు పథకం విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు.
దాంతో షర్మిల గురించి ఆలోచించే జనాలే కనబడటంలేదు. తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్, దళిత బంధు కాక రేపుతుంటే, తనకేం పట్టనట్లు దీక్షలు చేస్తాననడం.. పార్టీకి పెద్దగా మైలేజ్ ఇవ్వడం లేదన్న వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో వైఎస్ షర్మిల కేవలం తెలంగాణలో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు మాత్రమే నిరాహార దీక్షలు చేస్తున్నట్లుందన్నటాక్ వెల్లువెత్తుతోంది. మరి ఇప్పటికైనా వైఎస్ షర్మిల వ్యూహం మార్చుకుంటారేమో వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.