Crime News | మేడిపల్లిలో అమానుష ఘటన..గర్భవతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన భర్త | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crime News | మేడిపల్లిలో అమానుష ఘటన..గర్భవతిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసిన భర్త

 Authored By sandeep | The Telugu News | Updated on :24 August 2025,2:00 pm

Crime News | హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి ప్రాంతంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలాజీ హిల్స్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి తన గర్భవతి భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్క‌లు ముక్కుల‌గా నరికిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25), మహేందర్ అనే యువకుడిని ప్రేమించి కొంతకాలం క్రితం పెళ్లి చేసుకుంది.

మ‌రీ ఇంత దారుణ‌మా?

వివాహం అనంతరం ఈ దంపతులు బోడుప్పల్ ప్రాంతంలోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తరచూ గొడవలు జరుగుతుండగా, చివరకు మహేందర్ తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం… శనివారం మధ్యాహ్నం మహేందర్ తన భార్య స్వాతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు.

తల, చేతులు, కాళ్లను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. ఛాతీ భాగాన్ని కవర్‌లో పెట్టి గదిలోనే దాచినట్లు గుర్తించారు. మేడిపల్లి పోలీసులు స‌మాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్యను హత్య చేసిన విషయాన్ని మహేందర్ అంగీకరించాడు. హత్యకు గల కారణంగా కుటుంబ సమస్యలేనా, కట్న వేధింపులా లేక మరేదైనా వ్యక్తిగత కారణమా అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. మృతదేహం మిగతా భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది