India : గత కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏది అంటే చైనా అని అందరూ చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. తాజాగా ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్ అని తేలింది. ఇటీవల జనవరి నెలలో చైనా జనాభాను భారత్ అధిగమించినట్లు గణాంకాలు తెలియజేయడం జరిగింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం 2022 చివరి నాటికి భారతదేశం యొక్క జనాభా 141.7 కోట్లు కాగా ప్రస్తుతం జనవరి 18 నాటికి 142.8 కోట్లుగా ఉందని లెక్కలు తేలాయి.
చైనా జనాభా 141.2 కోట్లు. దీంతో.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గలిగిన దేశంగా రికార్డు సృష్టించినట్లు వార్తలొస్తున్నాయి. చైనాలో ఒకవైపు జననాల రేటు తగ్గటంతో పాటు మరోవైపు వయోవృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తమ దేశ జనాభా ఫస్ట్ టైం తగ్గిందని అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరిలో పూర్తిగా చైనాని దాటేసి భారత్ ఎవరు చేరుకొని స్థానంలో ఉంటుందని టాక్. ఇక 2050 నాటికి భారత్ జనాభా 167 కోట్లు ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తూ ఉంది.
మరోవైపు ప్రపంచ జనాభా 800 కోట్లు దాటడం జరిగింది. గత ఏడాది నవంబర్ 15వ తారీకు ఒక శిశు జన్మించడంతో ఐక్యరాజ్యసమితి ఈ విషయం వెల్లడించడం తెలిసిందే. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు ఉంటే 48 సంవత్సరాలలో డబల్ కావడం విశేషం. భారత్ వైద్య రంగాలలో పురోగతి సాధించడంతో మరణాలు రేటు తగ్గటంతో పాటు జనాభా పెరుగుదల కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడుతుంది. ఏది ఏమైనా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన మొదటి దేశంగా భారత్ అవతరించినట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.