Minister Roja speech satires on pawan kalyan
Minister Roja : శ్రీకాకుళంలో “యువశక్తి” మహాసభలో జనసేన నేత పవన్ కళ్యాణ్.. మంత్రి రోజాపై డైమండ్ రాణి అంటూ విమర్శలు చేయడం తెలిసిందే. నువ్వు కూడా..నా..అంటూ… తూ.., నా బతుకు చెడ అంటూ.. వ్యంగ్యంగా పవన్ విమర్శించారు. దీంతో మంత్రి రోజా తనపై పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల సందర్భం వచ్చిన ప్రతిసారి ఏకీపారేస్తున్నారు. రాజకీయాలలో వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నిన్ను ప్రజలు రెండు చోట్ల ఓడించారు. నిన్ను విమర్శించాలంటే నా బతుకు కూడా.. చెడ అన్న రీతిలో… రోజా కౌంటర్లు వేశారు. ఇదిలా ఉంటే ఇటీవల వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మరోసారి పవన్ కళ్యాణ్ ని కుక్కతో పోలుస్తూ.. విమర్శలు చేయడం జరిగింది.
“ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిని.. కొంతమంది మీటింగులు పెట్టి భౌభౌ..భీమ్ భుం అనీ అరుస్తున్నారు. వాళ్ల అరుపులు ఊగిపోవడాలు చూస్తుంటే వేమన పద్యం గుర్తొస్తుంది. “అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను..సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ”. ఈ పద్యంలో అల్పుడిని కంచుతోను.. సజ్జనుడుని.. కనకాంబరం అంటే బంగారంతోను వేమన పోల్చడం జరిగింది. ఇక మన రాష్ట్రంలో చూస్తే సజ్జనుడు జగన్మోహన్ అయితే అల్పుడు చాలామంది ఉన్నారు. గుంపులు గుంపులుగా వస్తున్నారు. ప్రతి వీకెండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి బౌబౌ అని అరవటం…
Minister Roja speech satires on pawan kalyan
తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడం. కానీ సజ్జనుడు మన మధ్యలోనే ఉంటూ.. ఇక్కడ ఇల్లు కట్టుకుని ప్రజల సంతోషాలలో పాలుపంచుకుంటున్నాడు. ప్రజా సమస్యల తీరుస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి అయిన నాకు మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసే రీతిలో సంస్కృతి శాఖ.. బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. మీకు సేవ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రోజుకొక వేమన పద్యం చదవండి. చదివిన ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. మనం మారితే మన పిల్లలలో మార్పు వస్తుంది. మనం మారితే సమాజం మారుతుంది అంటూ రోజా తనదైన శైలిలో వేమన జయంతి కార్యక్రమంలో పవన్ పై సెటైర్లు వేశారు.
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…
SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…
Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…
YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…
This website uses cookies.