ys jagan mohan reddy
ap 3 capitals : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలలు కంటున్నట్లుగా అతి త్వరలోనే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు కాబోతున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణ కోసం అంటూ ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాధన తీసుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. మొత్తం 101 వ్యాజ్యాలు కోర్టులో ఈ విషయమై ఉన్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత దూకుడుగా ఉన్నాడో కోర్టు అంత స్లోగా ఆ వ్యాజ్యాలను విచారిస్తున్నాయి. కోర్టు లో జరుగుతున్న ఆలస్యం కారణంగా వైకాపా ప్రభుత్వం కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధ్యం అయినంత త్వరగా రాజధానులను మార్చాలని భావిస్తున్నారు.
ఈ సమయంలో కోర్టులో ఉన్న ఈ వ్యాజ్యాలను వెంటనే విచారించేందుకు గాను ప్రత్యేక బెంజ్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పిటీషన్ల పై మార్చి 26వ తారీకు నుండి రెగ్యులర్ గా విచారణ జరుపనున్న నేపథ్యంలో అతి త్వరలోనే రాజధాని విషయమై ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసి గవర్నర్ తో కూడా గెజిట్ వేయించారు. కాని మండలిలో దీనికి అనుమతి రాకపోవడంతో పాటు అనేక కారణాలతో హైకోర్టులో వ్యాజ్యాలు నమోదు అయ్యాయి.
ys jagan mohan reddy
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్ మహేశ్వరి బదిలీ అవ్వడం వల్ల నిలిచి పోయిన విచారణ మళ్లీ ప్రారంభించబోతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆరు నెలల నుండి ఏడాది కాలంలోనే ఈ విచారణ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు ప్రభుత్వం తరపున లాయర్ విచారణ వేగవంతం చేయాలని కోర్టును కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఏడాదిలో మూడు రాజధానుల నుండి పరిపాలన కొనసాగే అవకాశం ఉందంటున్నారు. చాలా పట్టుబట్టి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను తీసుకు వచ్చాడు. ఆ నిర్ణయంపై వ్యతిరేకత ఉన్న కారణంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి విజయవాడ వాసులు కూడా సమర్థన తెలిపినట్లుగా అనిపిస్తుంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.