Jr ntr : తెలుగు దేశం పార్టీ ఏపీలో మరీ దారుణ పరిస్థితికి దిగజారి పోయింది. ఆ పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంను చవి చూసింది. ఆ తర్వాత జరుగుతున్న వరుస ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు మరో ఘోర పరాభవం తప్పలేదు. అందుకే తెలుగు దేశం పార్టీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ ఒక వర్గం నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వైకాపా మంత్రి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ అయితేనే మళ్లీ తెలుగు దేశం పార్టీకి జీవం వస్తుందని కొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ కొందరు రాజకీయాల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.
కీరవాణి కొడుకులు చేసిన తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఇతరులు మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ సీఎం.. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు సందడి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో వారి సీఎం నినాదాలు మారుమ్రోగిపోయాయి. దాంతో ఎన్టీఆర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ఆగండి బ్రదర్ అంటూ అభిమానులను ఆపే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అభిమానులు ఆపక పోవడంతో కోపంతో ఆపమని చెప్పా అంటూ సీరియస్ అయ్యాడు. దాంతో అభిమానులు కాస్త సైలెంట్ అయ్యారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు దేశం పార్టీ బాధ్యతలను నెత్తిన ఎత్తుకోవాల్సిందే అంటూ నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ భవిష్యత్తులో అయినా టీడీపీ బాధ్యతలు తీసుకోవాల్సిందే అంటున్నారు. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా ఆయన తప్పుకున్న తర్వాత అయినా ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందే అంటూ కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. నారా లోకేష్ మరియు ఎన్టీఆర్ ల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ కే ఆ పార్టీలో ఎక్కువ మద్దతు ఉంది అనడంలో సందేహం లేదు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.