ycp govt is destroying andhra pradesh says Chandrababu
Chandrababu : ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద సామాజిక వర్గం మద్దతు ఉండాలి. లేకపోతే గెలవడం కష్టం. అందుకే కొన్ని పార్టీలు కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుంటాయి. వాటి మీద ఫోకస్ పెడతాయి. ఆయా సామాజిక వర్గాలకు వరాలు కురిపిస్తాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. చంద్రబాబు నాయుడు పక్కన ఎప్పుడూ బీసీలు, ఎస్సీలు ఉంటారని, ఆయన చుట్టు ఎప్పుడూ వాళ్లే కనిపిస్తారని, కానీ.. జగన్ పక్కన మాత్రం ఎప్పుడూ రెడ్లే ఉంటారని, ఆయన ముందు చూసినా రెడ్లే.. వెనుక చూసినా రెడ్లే అని అచ్చెన్నాయుడు విమర్శించారు.
కేవలం రెడ్లకే రాష్ట్రాన్ని జగన్ కట్టబెట్టారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కేవలం బీసీలపై అధికారం చెలాయించడానికే, పెత్తనం చేయడానికే సీఎం జగన్.. రెడ్లకు అధికారం కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బీసీల కోసం కొత్తగా జగన్ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఆదరణ పరికరాలు ఇస్తే చాలు. టీడీపీ హయాంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కొనుగోలు చేసిన ఆదరణ పరికరాలను మూలన పడేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడానికి అదేమీ జగన్ తాత కట్టిన యూనివర్సిటీ కాదు.. అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Is Chandrababu TDP Supporting BCs To Get Vote Bank
బీసీ సాధికారిత సమితి పలు సూచనలు చేసిందని.. వాళ్లు ఇచ్చిన సూచనలు, సలహాలను మేనిఫెస్టోలో పెడతామని అచ్చెన్నాయుడు ఈసందర్భంగా స్పష్టం చేశారు. అందుకే టీడీపీ బీసీలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోందా.. వైసీపీ బీసీలను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికలు వచ్చేసరికి.. అన్ని సామాజిక వర్గాల అవసరం ప్రతి పార్టీకి ఉంటుంది. చూద్దాం.. ఎన్నికల వరకు ఏ సామాజిక వర్గం ఏ పార్టీవైపు మళ్లుతుందో?
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.