
jan-dhan-acccount-holders-must-link-their-aadhaar
ప్రస్తుత తరుణంలో బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ముఖ్యం. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవ్వరూ ఉండరు. ఆన్ లైన్ లావాదేవీలు చేయాలన్నా.. డబ్బులు బ్యాంకులో దాచుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది.. ఎక్కువగా లావాదేవీలు కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ను తీసుకుంటున్నారు. అయితే.. చాలా బ్యాంకులు వినియోగదారుల కోసం అకౌంట్ ను క్రియేట్ చేస్తున్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం.. పేదల కోసం జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాను తీసుకొచ్చింది. జన్ ధన్ ఖాతా కింద దేశంలోని పేద ప్రజలు ఏ బ్యాంకులో అయినా జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ తీసుకునే విధంగా వెసులుబాటును కేంద్రం కల్పించింది.
jan dhan acccount holders must link their aadhaar
జన్ ధన్ ఖాతా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే.. ఈ కార్డు మీద 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ ను కల్పిస్తోంది. రూపాయి కట్టకున్నా… రూపే డెబిట్ కార్డుతో 2 లక్షల రూపాయల ఇన్సురెన్స్ కు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
అయితే.. జన్ ధన్ ఖాతా ఇదివరకే తీసుకొని ఉన్నవాళ్లు.. వెంటనే ఆధార్ కార్డుతో వాళ్ల అకౌంట్ ను లింక్ చేసుకోవాలి. ఇదివరకే అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకొని ఉంటే సమస్య లేదు కానీ.. ఇప్పటి వరకు ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకపోతే మాత్రం.. రూపే డెబిట్ కార్డుపై అందించే యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ బెనిఫిట్ ఉండదు. దీంతో మీరు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్టే.
jan-dhan-acccount-holders-must-link-their-aadhaar
జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లకు యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ తో పాటు లైఫ్ ఇన్సురెన్స్ ను కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీని వల్ల 30 వేల రూపాయల వరకు బీమా లభిస్తుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లు.. ఏదైనా కారణం చేత మరణించినా.. సహజంగా మరణించినా వాళ్ల కుటుంబానికి 30 వేల రూపాయలను బ్యాంకులు అందిస్తాయి. జన్ ధన్ ఖాతా ద్వారా లైఫ్ ఇన్సురెన్స్ పొందాలంటే కూడా ఖచ్చితంగా ఆధార్ ను అకౌంట్ తో లింక్ చేసుకోవాలి.
అందుకే.. జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లు.. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆధార్ తో తమ ఖాతాను లింక్ చేసుకోవాలి. లేకపోతే.. అనవసరంగా 2.3 లక్షల రూపాయల వరకు ఊరికే నష్టపోవాల్సి వస్తుంది. ఇదివరకు ఆధార్ ను లింక్ చేసుకున్న వాళ్లు మరోసారి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తమ జన్ ధన్ బ్యాంక్ ఖాతాను లింక్ చేయని వాళ్లు మాత్రమే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆధార్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
This website uses cookies.