
jan-dhan-acccount-holders-must-link-their-aadhaar
ప్రస్తుత తరుణంలో బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ముఖ్యం. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవ్వరూ ఉండరు. ఆన్ లైన్ లావాదేవీలు చేయాలన్నా.. డబ్బులు బ్యాంకులో దాచుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది.. ఎక్కువగా లావాదేవీలు కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ను తీసుకుంటున్నారు. అయితే.. చాలా బ్యాంకులు వినియోగదారుల కోసం అకౌంట్ ను క్రియేట్ చేస్తున్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం.. పేదల కోసం జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాను తీసుకొచ్చింది. జన్ ధన్ ఖాతా కింద దేశంలోని పేద ప్రజలు ఏ బ్యాంకులో అయినా జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ తీసుకునే విధంగా వెసులుబాటును కేంద్రం కల్పించింది.
jan dhan acccount holders must link their aadhaar
జన్ ధన్ ఖాతా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే.. ఈ కార్డు మీద 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ ను కల్పిస్తోంది. రూపాయి కట్టకున్నా… రూపే డెబిట్ కార్డుతో 2 లక్షల రూపాయల ఇన్సురెన్స్ కు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
అయితే.. జన్ ధన్ ఖాతా ఇదివరకే తీసుకొని ఉన్నవాళ్లు.. వెంటనే ఆధార్ కార్డుతో వాళ్ల అకౌంట్ ను లింక్ చేసుకోవాలి. ఇదివరకే అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకొని ఉంటే సమస్య లేదు కానీ.. ఇప్పటి వరకు ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకపోతే మాత్రం.. రూపే డెబిట్ కార్డుపై అందించే యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ బెనిఫిట్ ఉండదు. దీంతో మీరు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్టే.
jan-dhan-acccount-holders-must-link-their-aadhaar
జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లకు యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ తో పాటు లైఫ్ ఇన్సురెన్స్ ను కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీని వల్ల 30 వేల రూపాయల వరకు బీమా లభిస్తుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లు.. ఏదైనా కారణం చేత మరణించినా.. సహజంగా మరణించినా వాళ్ల కుటుంబానికి 30 వేల రూపాయలను బ్యాంకులు అందిస్తాయి. జన్ ధన్ ఖాతా ద్వారా లైఫ్ ఇన్సురెన్స్ పొందాలంటే కూడా ఖచ్చితంగా ఆధార్ ను అకౌంట్ తో లింక్ చేసుకోవాలి.
అందుకే.. జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లు.. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆధార్ తో తమ ఖాతాను లింక్ చేసుకోవాలి. లేకపోతే.. అనవసరంగా 2.3 లక్షల రూపాయల వరకు ఊరికే నష్టపోవాల్సి వస్తుంది. ఇదివరకు ఆధార్ ను లింక్ చేసుకున్న వాళ్లు మరోసారి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తమ జన్ ధన్ బ్యాంక్ ఖాతాను లింక్ చేయని వాళ్లు మాత్రమే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆధార్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
This website uses cookies.