
jan-dhan-acccount-holders-must-link-their-aadhaar
ప్రస్తుత తరుణంలో బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ముఖ్యం. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవ్వరూ ఉండరు. ఆన్ లైన్ లావాదేవీలు చేయాలన్నా.. డబ్బులు బ్యాంకులో దాచుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది.. ఎక్కువగా లావాదేవీలు కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ను తీసుకుంటున్నారు. అయితే.. చాలా బ్యాంకులు వినియోగదారుల కోసం అకౌంట్ ను క్రియేట్ చేస్తున్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం.. పేదల కోసం జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాను తీసుకొచ్చింది. జన్ ధన్ ఖాతా కింద దేశంలోని పేద ప్రజలు ఏ బ్యాంకులో అయినా జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ తీసుకునే విధంగా వెసులుబాటును కేంద్రం కల్పించింది.
jan dhan acccount holders must link their aadhaar
జన్ ధన్ ఖాతా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే.. ఈ కార్డు మీద 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ ను కల్పిస్తోంది. రూపాయి కట్టకున్నా… రూపే డెబిట్ కార్డుతో 2 లక్షల రూపాయల ఇన్సురెన్స్ కు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
అయితే.. జన్ ధన్ ఖాతా ఇదివరకే తీసుకొని ఉన్నవాళ్లు.. వెంటనే ఆధార్ కార్డుతో వాళ్ల అకౌంట్ ను లింక్ చేసుకోవాలి. ఇదివరకే అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకొని ఉంటే సమస్య లేదు కానీ.. ఇప్పటి వరకు ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకపోతే మాత్రం.. రూపే డెబిట్ కార్డుపై అందించే యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ బెనిఫిట్ ఉండదు. దీంతో మీరు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్టే.
jan-dhan-acccount-holders-must-link-their-aadhaar
జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లకు యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ తో పాటు లైఫ్ ఇన్సురెన్స్ ను కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీని వల్ల 30 వేల రూపాయల వరకు బీమా లభిస్తుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లు.. ఏదైనా కారణం చేత మరణించినా.. సహజంగా మరణించినా వాళ్ల కుటుంబానికి 30 వేల రూపాయలను బ్యాంకులు అందిస్తాయి. జన్ ధన్ ఖాతా ద్వారా లైఫ్ ఇన్సురెన్స్ పొందాలంటే కూడా ఖచ్చితంగా ఆధార్ ను అకౌంట్ తో లింక్ చేసుకోవాలి.
అందుకే.. జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లు.. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆధార్ తో తమ ఖాతాను లింక్ చేసుకోవాలి. లేకపోతే.. అనవసరంగా 2.3 లక్షల రూపాయల వరకు ఊరికే నష్టపోవాల్సి వస్తుంది. ఇదివరకు ఆధార్ ను లింక్ చేసుకున్న వాళ్లు మరోసారి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తమ జన్ ధన్ బ్యాంక్ ఖాతాను లింక్ చేయని వాళ్లు మాత్రమే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆధార్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్కంఠకు గురిచేస్తున్న స్టార్…
Today Gold Rate : బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది పెట్టుబడి, భద్రత,…
Collagen Drinks : వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో సహజంగా ఉండే కొల్లాజెన్ ( Collagen ) ఉత్పత్తి తగ్గడం…
High-Protein Vegetarian Diet : ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కండరాల నిర్మాణం, కణజాలాల…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ఈ…
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
Free Railways Ticket : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…
Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…
300 Units Free Electricity : విద్యుత్ బిల్లుల భారం తగ్గించాలని భావిస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన PM…
Hai Jawani Toh Ishq Hona Hai Movie Review : బాలీవుడ్ స్టార్ Varun Dhawan హీరోగా, Mrunal…
Rythu Bharosa : తెలంగాణ Telangana రైతులకు Farmers ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకం…
This website uses cookies.