
janasena chief pawan kalyan about pm modi
నేను ఎక్కడో పుట్టలేదు. రైతు కుటుంబంలోనే పుట్టా. రైతుల బాధలు నాకు తెలుసు. రైతుల కష్టాలు తెలుసు. అందుకే నేను జైకిసాన్ అనే ఉద్యమాన్న ప్రారంభిస్తున్నా.. అంటూ పవన్ కళ్యాణ్.. ఇటీవల నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు చెప్పిన మాట.
janasena chief pawan kalyan about pm modi
అవును.. నేడు మన దేశంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా చివరకు రైతులకు ఎటువంటి ఫలితం దక్కడం లేదు.
అయితే.. ఇటీవల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని.. నివర్ తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ వ్యాఖ్యానించారు. కేవలం ఏపీ ప్రభుత్వాన్ని మాత్రమే ఆయన టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు.
ఆయన పర్యటన కూడా నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ రైతులతో చాలా భావోద్వేగంతో మాట్లాడారు. రైతుల కష్టాలను తీర్చాలంటూ ప్రభుత్వాన్ని అడిగారు.
సరే.. రైతులు రైతులే. ఎక్కడి రైతులైనా పండించేది పంటే. వాళ్లు పండిస్తేనే నాలుగు వేళ్లు మన నోట్లోకి వెళ్తాయి. మరి.. ఏపీ రైతుల గురించి అంతగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న హర్యానా, పంజాబ్ రైతులు కనిపించలేదా? అంటూ ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. వాళ్లు రైతుల్లా పవన్ కు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
అసలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విషయం గురించి కూడా మాట్లాడటానికి పవన్ సమ్మతించడం లేదు. ఇటీవల నివర్ తుపాన్ పర్యటన సమయంలోనూ ఓ విలేఖరి.. హర్యానా రైతుల నిరసన గురించి పవన్ ను ప్రశ్నించినా పవన్ దాటవేత సమాధానం ఇచ్చారు తప్పితే.. దానిపై స్పందించలేదు. ఏపీ రైతుల గురించే ఆలోచిస్తున్న పవన్.. దేశంలోని మిగితా రైతుల బాధలను కూడా పట్టించుకుంటే మంచిదే కదా.. అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అయితే సీఎం జగన్ ను ప్రశ్నించే పవన్.. ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని ప్రశ్నించడం లేదు. ఎవరైనా రైతులే కదా. మోదీ అంటే ఎందుకు పవన్ అంతలా భయపడుతున్నారు? కారణం ఏంటి?… అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.