నేను ఎక్కడో పుట్టలేదు. రైతు కుటుంబంలోనే పుట్టా. రైతుల బాధలు నాకు తెలుసు. రైతుల కష్టాలు తెలుసు. అందుకే నేను జైకిసాన్ అనే ఉద్యమాన్న ప్రారంభిస్తున్నా.. అంటూ పవన్ కళ్యాణ్.. ఇటీవల నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు చెప్పిన మాట.
అవును.. నేడు మన దేశంలో రైతులు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా చివరకు రైతులకు ఎటువంటి ఫలితం దక్కడం లేదు.
అయితే.. ఇటీవల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని.. నివర్ తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ వ్యాఖ్యానించారు. కేవలం ఏపీ ప్రభుత్వాన్ని మాత్రమే ఆయన టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు.
ఆయన పర్యటన కూడా నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగింది. అక్కడ రైతులతో చాలా భావోద్వేగంతో మాట్లాడారు. రైతుల కష్టాలను తీర్చాలంటూ ప్రభుత్వాన్ని అడిగారు.
సరే.. రైతులు రైతులే. ఎక్కడి రైతులైనా పండించేది పంటే. వాళ్లు పండిస్తేనే నాలుగు వేళ్లు మన నోట్లోకి వెళ్తాయి. మరి.. ఏపీ రైతుల గురించి అంతగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న హర్యానా, పంజాబ్ రైతులు కనిపించలేదా? అంటూ ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. వాళ్లు రైతుల్లా పవన్ కు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
అసలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విషయం గురించి కూడా మాట్లాడటానికి పవన్ సమ్మతించడం లేదు. ఇటీవల నివర్ తుపాన్ పర్యటన సమయంలోనూ ఓ విలేఖరి.. హర్యానా రైతుల నిరసన గురించి పవన్ ను ప్రశ్నించినా పవన్ దాటవేత సమాధానం ఇచ్చారు తప్పితే.. దానిపై స్పందించలేదు. ఏపీ రైతుల గురించే ఆలోచిస్తున్న పవన్.. దేశంలోని మిగితా రైతుల బాధలను కూడా పట్టించుకుంటే మంచిదే కదా.. అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అయితే సీఎం జగన్ ను ప్రశ్నించే పవన్.. ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీని ప్రశ్నించడం లేదు. ఎవరైనా రైతులే కదా. మోదీ అంటే ఎందుకు పవన్ అంతలా భయపడుతున్నారు? కారణం ఏంటి?… అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.