kapus are waiting for YS Jagan decision about kapu reservation
YS Jagan : కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అంశం అది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కాపు సామాజికవర్గం తమ రిజర్వేషన్లపై పోరాడింది. కానీ.. రిజర్వేషన్లు అమలు కాలేదు. ఆ తర్వాత ఎన్నికలు రావడం 2019 లో జగన్ సీఎం కావడంతో ప్రస్తుతం జగన్ వైపు కాపులు చూస్తున్నారు. ఇప్పటికే అగ్రవర్ణాలకు చెందిన పేదలకు కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దానికి సుప్రీం కోర్టు కూడా ఓకే చెప్పింది. సుప్రీంకోర్టు ఆమోదం తెలిపాక ఇక ఆగేదేం ఉంటుంది చెప్పండి. అందుకే.. ఏపీలో కూడా రిజర్వేషన్ల కోసం కాపులు ఎదురు చూస్తున్నారు. నిజానికి.. అగ్రవర్ణాల్లో పేదలు అంటే మనకు ముందు గుర్తొచ్చేది కాపులే. వాళ్లే తమకు రిజర్వేషన్లు అమలు చేయాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ చేశారు.
అప్పట్లో చంద్రబాబు.. కాపులను బీసీల్లో చేరుస్తా అని కూడా మాటిచ్చారు. కానీ.. అది కేంద్రానికి సంబంధించిన అంశం కావడంతో కాపులు ఇచ్చి మాట ప్రకారం.. బీసీల్లో చేర్చలేకపోయారు. అయితే.. 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అప్పుడే 5 శాతం చంద్రబాబు కాపులకు కేటాయించారు. కానీ.. అప్పుడు ఎన్నికల హడావుడి వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోయారు. దీంతో కాపుల అంశం అటకెక్కింది.
kapus are waiting for YS Jagan decision about kapu reservation
ప్రస్తుతం 10 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఆమోదించింది కాబట్టి అందులో తమకు 5 శాతం రిజర్వేషన్ ను కల్పించాలని కాపు కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయాలి అంటే ఇప్పుడు జగన్ చేయాల్సిందే. జగన్ తీసుకునే నిర్ణయం మీదే కాపుల రిజర్వేషన్ ఆధారపడి ఉంది. మరి.. జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో ఎలాగూ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాపు సంఘాలు అదే డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం 5 శాతం రిజర్వేషన్ వెంటనే కాపులకు అమలు చేస్తే ఇది టీడీపీ, జనసేన లాంటి పార్టీలకు మైనస్ అవుతుంది. ఎందుకంటే.. కాపులు మొత్తం జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. చూద్దాం మరి.. వచ్చే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకొని జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.