Karapusa recipe : బియ్యం పిండితో కారపూసఎంతో క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karapusa recipe : బియ్యం పిండితో కారపూసఎంతో క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది

 Authored By prabhas | The Telugu News | Updated on :2 October 2022,7:30 am

Karapusa recipe :పండుగలకు ఎక్కువగా కారపూస ను చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఈ కారపూస గట్టిగా వస్తూ ఉంటుంది. అలా గట్టిగా రాకుండా ఇలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కారపూసను ఇప్పుడు చేసి చూద్దాం. ఈ కారపుసకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, బియ్యప్పిండి, సెనగపిండి, ఆయిల్, నీళ్లు, వెన్న,పసుపు మొదలైనవి…

ఈ కారపుస తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ కి జార్లోకి రెండు గరిటెల వాముని, పది పచ్చిమిర్చిని, నాలుగైదు ఇంచల అల్లం ముక్కలని వేసి మెత్తని పేస్ట్ ల పట్టి దాన్లో మళ్లీ వాటర్ వేసి మల్లొకసారి పట్టుకోవాలి. తర్వాత దానిని బాగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి రెండు కప్పుల బియ్యప్పిండి, రెండు కప్పుల సెనగపిండి వేసి జల్లించుకొని బౌల్లో వేసుకోవాలి. తర్వాత దానిలోకి కొంచెం వెన్న, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

Karappusa with rice flour is so crispy that it melts in your mouth

Karappusa with rice flour is so crispy that it melts in your mouth

తర్వాత దానిలో ముందుగా వడకట్టి పెట్టుకున్న వాము వాటర్ ని వేసుకుంటూ బాగా స్మూత్ గా కలుపుకోవాలి. ఇక ఈ పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఒక స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి ఎక్కిన తర్వాత మురుకులు కొట్టంతో కారపూసను ఒత్తుకోవాలి. ఇలా సన్న పూస కావాలంటే సన్నది ఒత్తుకోవచ్చు.. లేదా లావు పూస కావాలి అంటే లావు పూస కూడా ఒత్తుకోవచ్చు. ఇలా చేసుకుని ఈ కారపూస చల్లారిన తర్వాత ఎయిర్టెడ్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి. అంతే ఎంతో సింపుల్ గా కొత్త వెరైటీ కారపూస రెడీ.

YouTube video

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది