KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా బీజేపీకి దూరం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఆ సమయంలో తనకు జ్వరం వచ్చినట్లుగా చెబుతున్నా కూడా కేసీఆర్ బీజేపీ పై కోపంతోనే ఆ పర్యటన కి దూరంగా ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ మరియు ప్రధాని రాష్ట్రానికి ఏం చేశారని ప్రధాని మోడీ కి స్వాగతాలు పలకాలి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది.
తాజాగా కాంగ్రెస్ అధినేత అయిన రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. బీజేపీ ప్రభుత్వం సర్జికల్ దాడులు చేసింది అని అనడానికి ఆధారాలు చూపాలని అంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన నేపథ్యం లో అస్సాం సీఎం మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. సోనియా గాంధీ పై మరియు రాహుల్ గాంధీ పై అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానించాడు. నీవు రాజీవ్ గాంధీ కొడుకువి అనటానికి ఆధారాలేంటి అంటూ ఆయన ప్రశ్నించడం తో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీని అంతలా విమర్శిస్తారా.. బీజేపీ వాళ్లకు మానవత్వం ఉందా అంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలిచాడు.
దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం కి సంబంధించిన వ్యక్తి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే సమయం లో కాంగ్రెస్ కు ఈ విషయం లో తమ మద్దతు ఉంటుంది అని టిఆర్ఎస్ వర్గాల వారు ప్రకటించారు. ఈ నేపథ్యం లో 2023 సంవత్సరంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియూ టిఆర్ఎస్ లు కలిసిపోతాయా అనే చర్చ మొదలు అయింది. బీజేపీకి బలం బాగా పెరిగింది ఈ సమయం లో కాంగ్రెస్ తో జోడి కడితే తప్పితే బీజేపీని ఎదుర్కోవడం కష్టం అంటూ కెసిఆర్ భావిస్తున్నాడు ఏమో అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఏ సమయం లో ఎలా వ్యవహరిస్తాడు అనేది ఎవరికీ తెలియదు. కనుక వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎలాంటి రాజకీయ వ్యూహాలను కేసీఆర్ అనుసరిస్తాడు అనేది చూడాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.