
krishnapatnam anandayya ayurvedic medicine in nellore
Krishnapatnam Anandayya : ప్రస్తుతం ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు గురించే చర్చ. అసలు అది నిజంగానే ఆయుర్వేద మందేనా? నిజంగా ఆ మందు వేసుకుంటే కరోనా తగ్గుతుందా? లాంటి ఎన్నో అనుమానాలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. నిజానికి.. ఆనందయ్య ఇప్పటికే ఆ కరోనా మందును లక్షల మందికి ఉచితంగా పంచిపెట్టారు. దాన్ని వేసుకున్న వాళ్లందరూ బాగుందని, తమకు కరోనా తగ్గిందని చెప్పారు తప్పితే దాని వల్ల తమకు ఎటువంటి సమస్యలు రాలేదని చెప్పడంతో.. ఆయన మందుకు డిమాండ్ పెరిగింది. అయితే.. ఇది ఆయుర్వేద మందు కాదని.. కేవలం నాటు మందు మాత్రమేనని.. దీన్ని వాడటం, వాడకపోవడం అనేది ప్రజల ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుందని.. దీన్ని ఆయుర్వేద మందుగా మాత్రం పరిగణించలేమని.. ఆ మందును పరిశీలించిన ఆయుష్ అధికారులు స్పష్టం చేశారు.
krishnapatnam anandayya ayurvedic medicine in nellore
మరోవైపు ఐసీఎంఆర్ కు కూడా ఆ మందును టెస్ట్ కు పంపించింది ఏపీ ప్రభుత్వం. ఆ నివేదిక వస్తే కానీ.. తదుపరి ఆ మందు పంపిణీపై ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు అయితే ఈ మందు పంపిణీని నిలిపి వేయాలని ప్రభుత్వం ఆనందయ్యను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం మందు పంపిణీని నిలిపివేశారు. అయితే.. అక్కడికి జనాలు కూడా వేల సంఖ్యల్లో వస్తుండటంతో మందు తయారీని పెద్ద మొత్తంలో చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో తన మందు గురించి, ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆనందయ్య స్పందించారు. నేను తయారు చేసిన మందుపై సీఎం జగన్ సానుకూలంగానే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం నాకు అన్ని విధాలుగా సహకరిస్తోంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటా. నేను తయారు చేసిన మందు ఆయుర్వేద మందే. అది నాటు మందు కాదు. నేను ప్రజలకు మేలు చేయాలని.. వాళ్లను కరోనా బారి నుంచి కాపాడటం కోసమే ఆ మందును తయారు చేశాను తప్పితే.. ఏదో డబ్బులు సంపాదించడం కోసమో.. పేరు సంపాదించడం కోసమో కాదు. అయితే.. వేల మంది ఒకేసారి తరలివస్తుండటంతో.. అంతమందికి కరోనా మందు తయారు చేయాలంటే కాస్త సమయం పడుతుంది. అందుకే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందో చూసి.. ప్రభుత్వం అనుమతించాకే మందు పంపిణీని ప్రారంభిస్తాం.. అని ఆనందయ్య స్పష్టం చేశారు.
నా ఆయుర్వేద మందు పేరుతో బయట కొందరు నకిలీ మందులు అమ్ముతున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు. దయచేసి అటువంటి మందుల జోలికి పోకండి. కొందరు నా మందును బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. అందుకే.. అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే.. ఏపీకి చెందిన కోటయ్య అనే వ్యక్తికి మందు వేసి నాలుగు రోజులు దాటింది. ఆయనకు ఆయుర్వేద మందు వేయడం వల్లనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పలేం.. అని ఆనందయ్య వెల్లడించారు.
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
This website uses cookies.