
KTR Harish rao
KTR : మొన్ననే నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగిసింది. మళ్లీ పురపాలక పోరు మొదలైంది తెలంగాణలో. రెండు గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. వరంగల్, ఖమ్మం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు… సిద్ధిపేట, కొత్తూరు, అచ్చంపేట, నకిరెకల్, జడ్చర్లలో మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ మిగితా పార్టీల కంటే ముందుగానే అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ వెలువడగానే వెంటనే పార్టీ రంగంలోకి దిగి… ఆయా మునిసిపాలిటీల్లో ఇన్ చార్జ్ లను నియమించింది. ఈనెల 30 న పురపాలక పోరు జరగనున్న నేపథ్యంలో… వెంటనే ఇన్ చార్జ్ లు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.అయితే… ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఆయన పురపాలక ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు.
చివరకు మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలని ఆయన తప్పుకున్నారా? లేక మంత్రి కేటీఆర్ ను ఇన్వాల్వ్ చేయలేదా? అనే విషయంపై క్లారిటీ లేకున్నప్పటికీ…. మొత్తం పురపాలక ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటు.. ప్రచార బాధ్యతలను కూడా మంత్రి హరీశ్ రావుకు అప్పగించిందట అధిష్ఠానం. సీఎం కేసీఆరే మంత్రి హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు ఊహాగాలనులు వెలువడుతున్నాయి. అయితే… మంత్రి కేటీఆర్ ను కాదని హరీశ్ రావుకు…. కేసీఆర్ ఎందుకు పురపాలక ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
KTR Harish rao
అయితే.. ఇటీవల మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే…. మంత్రి కేటీఆర్.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. వరంగల్ కూడా వెళ్లారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పటికీ… కేటీఆర్ సిద్ధిపేటకు మాత్రం వెళ్లలేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.
మొత్తానికి ఈ పురపాలక ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉండబోతున్నారు. ఇక ఎన్నికలు జరగబోయే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు పార్టీ అధిష్ఠానం ఇన్ చార్జ్ లను నియమించింది. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంకు పువ్వాడ అజయ్, సిద్ధిపేటకు హరీశ్ రావు, కొత్తూరుకు శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేటకు నిరంజన్ రెడ్డి, నకిరేకల్ కు జగదీశ్ రెడ్డి, జడ్చర్లకు లక్ష్మారెడ్డి ఇన్ చార్జ్ లుగా ఉండనున్నారు.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.