
KTR Harish rao
KTR : మొన్ననే నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగిసింది. మళ్లీ పురపాలక పోరు మొదలైంది తెలంగాణలో. రెండు గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. వరంగల్, ఖమ్మం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు… సిద్ధిపేట, కొత్తూరు, అచ్చంపేట, నకిరెకల్, జడ్చర్లలో మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ మిగితా పార్టీల కంటే ముందుగానే అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ వెలువడగానే వెంటనే పార్టీ రంగంలోకి దిగి… ఆయా మునిసిపాలిటీల్లో ఇన్ చార్జ్ లను నియమించింది. ఈనెల 30 న పురపాలక పోరు జరగనున్న నేపథ్యంలో… వెంటనే ఇన్ చార్జ్ లు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.అయితే… ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఆయన పురపాలక ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు.
చివరకు మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలని ఆయన తప్పుకున్నారా? లేక మంత్రి కేటీఆర్ ను ఇన్వాల్వ్ చేయలేదా? అనే విషయంపై క్లారిటీ లేకున్నప్పటికీ…. మొత్తం పురపాలక ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటు.. ప్రచార బాధ్యతలను కూడా మంత్రి హరీశ్ రావుకు అప్పగించిందట అధిష్ఠానం. సీఎం కేసీఆరే మంత్రి హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు ఊహాగాలనులు వెలువడుతున్నాయి. అయితే… మంత్రి కేటీఆర్ ను కాదని హరీశ్ రావుకు…. కేసీఆర్ ఎందుకు పురపాలక ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
KTR Harish rao
అయితే.. ఇటీవల మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే…. మంత్రి కేటీఆర్.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. వరంగల్ కూడా వెళ్లారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పటికీ… కేటీఆర్ సిద్ధిపేటకు మాత్రం వెళ్లలేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.
మొత్తానికి ఈ పురపాలక ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉండబోతున్నారు. ఇక ఎన్నికలు జరగబోయే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు పార్టీ అధిష్ఠానం ఇన్ చార్జ్ లను నియమించింది. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంకు పువ్వాడ అజయ్, సిద్ధిపేటకు హరీశ్ రావు, కొత్తూరుకు శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేటకు నిరంజన్ రెడ్డి, నకిరేకల్ కు జగదీశ్ రెడ్డి, జడ్చర్లకు లక్ష్మారెడ్డి ఇన్ చార్జ్ లుగా ఉండనున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.