Home » News » Ktr Not To Campaign In Siddipet Municipal Elections
News

KTR : కేటీఆర్ ను పక్కన పెట్టి… హరీశ్ రావుకు బాధ్యతలు? సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: April 19, 2021 11:02 am
Advertisement

KTR : మొన్ననే నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముగిసింది. మళ్లీ పురపాలక పోరు మొదలైంది తెలంగాణలో. రెండు గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. వరంగల్, ఖమ్మం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు… సిద్ధిపేట, కొత్తూరు, అచ్చంపేట, నకిరెకల్, జడ్చర్లలో మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ మిగితా పార్టీల కంటే ముందుగానే అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్ వెలువడగానే వెంటనే పార్టీ రంగంలోకి దిగి… ఆయా మునిసిపాలిటీల్లో ఇన్ చార్జ్ లను నియమించింది. ఈనెల 30 న పురపాలక పోరు జరగనున్న నేపథ్యంలో… వెంటనే ఇన్ చార్జ్ లు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.అయితే… ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. ఆయన పురపాలక ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు.

చివరకు మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కావాలని ఆయన తప్పుకున్నారా? లేక మంత్రి కేటీఆర్ ను ఇన్వాల్వ్ చేయలేదా? అనే విషయంపై క్లారిటీ లేకున్నప్పటికీ…. మొత్తం పురపాలక ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటు.. ప్రచార బాధ్యతలను కూడా మంత్రి హరీశ్ రావుకు అప్పగించిందట అధిష్ఠానం. సీఎం కేసీఆరే మంత్రి హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు ఊహాగాలనులు వెలువడుతున్నాయి. అయితే… మంత్రి కేటీఆర్ ను కాదని హరీశ్ రావుకు…. కేసీఆర్ ఎందుకు పురపాలక ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు అనేది మాత్రం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.

Advertisement

KTR Harish rao

KTR : సిద్ధిపేటలో అడుగు పెట్టని కేటీఆర్

అయితే.. ఇటీవల మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే…. మంత్రి కేటీఆర్.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. వరంగల్ కూడా వెళ్లారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరిగినప్పటికీ… కేటీఆర్ సిద్ధిపేటకు మాత్రం వెళ్లలేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.

Advertisement

మొత్తానికి ఈ పురపాలక ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దూరంగా ఉండబోతున్నారు. ఇక ఎన్నికలు జరగబోయే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు పార్టీ అధిష్ఠానం ఇన్ చార్జ్ లను నియమించింది. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంకు పువ్వాడ అజయ్, సిద్ధిపేటకు హరీశ్ రావు, కొత్తూరుకు శ్రీనివాస్ గౌడ్, అచ్చంపేటకు నిరంజన్ రెడ్డి, నకిరేకల్ కు జగదీశ్ రెడ్డి, జడ్చర్లకు లక్ష్మారెడ్డి ఇన్ చార్జ్ లుగా ఉండనున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి