
kunduru jana reddy gives clarity on joining bjp party
తెలంగాణలో మాత్రం వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. మొన్న దుబ్బాక ఉపఎన్నిక.. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. నేడో రేపో నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనుంది. అయితే.. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపించిన వ్యతిరేకతను టీఆర్ఎస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. ఏది ఏమైనా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకే ఇప్పటికే సీఎం కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారు.
kunduru jana reddy gives clarity on joining bjp party
అయితే.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జానారెడ్డి. ఆయన గురించే ప్రస్తుతం తెలంగాణలో చర్చ. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ గత కొంత కాలంగా విపరీతంగా వార్తలు వస్తున్నాయి. దానిపై జానా రెడ్డి ఫుల్లు క్లారిటీ ఇచ్చేశారు.
గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న జానారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. మీరు వేరే పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. టీఆర్ఎస్ నేతలు కానీ… బీజేపీ నేతలు కానీ.. మిమ్మల్ని సంప్రదించారా? అంటూ మీడియా ప్రశ్నించగా… మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? అంటూ జానారెడ్డి.. మీడియాను ఎదురు ప్రశ్నించారు.
మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే.. వాళ్లను నా వద్దకు తీసుకురండి.. వాళ్లలో అప్పుడు చర్చించి మాట్లాడుతా.. అంటూ జానారెడ్డి స్పష్టం చేశారు.
మరి.. నాగార్జున సాగర్ లో పోటీ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా.. నేను పోటీ చేయడం కాదు.. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నాగార్జున సాగర్ లో పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది. పీసీసీకి ఎవరు అధ్యక్షుడు ఉండాలి.. అనేదానిపై నా నిర్ణయాన్ని నేను కోర్ కమిటీకి చెప్పాను.. అంటూ జానారెడ్డి చెప్పారు.
అయితే.. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి.. జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారనేది అవాస్తమే. అది నిజం కాదు. ఒకవేళ జానారెడ్డి.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే… టీఆర్ఎస్ పార్టీకి.. జానారెడ్డా గట్టి పోటీని ఇచ్చినట్టే. ఎందుకంటే.. నాగార్జున సాగర్.. జానారెడ్డి కంచుకోట. చూడాలి మరి.. నాగార్జునసాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కుంటుందో?
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
This website uses cookies.