
chandrababu alerting tdp leaders for coming elections
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయా? ఏం ఎన్నికలు అని షాక్ కాకండి. మనం మాట్లాడుకునేది తిరుపతి ఉపఎన్నిక గురించి కూడా కాదు. సార్వత్రిక ఎన్నికల గురించే. అవి జరిగి ఏడాదిన్నర కూడా కాలేదు.. అప్పుడే సార్వత్రిక ఎన్నికలు ఏంది? అంటూ కంగారు అస్సలు పడకండి.. చంద్రబాబు అంతర్యం ఏంటో తెలుసుకుందాం పదండి..
chandrababu alerting tdp leaders for coming elections
2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ.. జమిలి ఎన్నికల కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ.. అప్పుడే మొదటి సారి అధికారంలోకి రావడంతో జమిలి ఎన్నికలు అంశాన్ని అప్పుడు పక్కన పెట్టారు మోదీ. కానీ.. 2019లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో.. ప్రస్తుతం కేంద్రం.. జమిలి ఎన్నికలపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే.. ఒకే దేశం.. ఒకే ఎన్నికలా.. ఐదేళ్లకు ఒకేసారి దేశమంతా ఎన్నికలను నిర్వహించే పద్ధతికి శ్రీకారం చుట్టునుంది కేంద్రం. జమిలి ఎన్నికలకు పునాది 2022లోనే పడుతుందని.. 2022లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని, అలర్ట్ గా ఉండాలంటూ చంద్రబాబు టీడీపీ శ్రేణులకు చెబుతున్నారట.
ఏపీలో ఎంత త్వరగా ఎన్నికలు వస్తే.. చంద్రబాబుకు అంత బెటర్. తమ సత్తా చాటేందుకు టీడీపీకి మరో అవకాశం వస్తుంది కదా. 2014 లో బంపర్ మెజారిటీతో గెలిచిన చంద్రబాబు.. 2019లో బొక్కబోర్లా పడ్డారు. కేవలం 23 ఎమ్మెల్యేలే గెలిచారు. తన కొడుకు కూడా గెలవలేకపోయారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు కొంచెం డీలా పడ్డారు. కానీ.. వెంటనే తేరుకొని.. యాక్టివ్ అవుతున్నారు.
ప్రస్తుతం వరుస మీటింగ్ లు పెడుతున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చంద్రబాబు… పార్టీ నాయకులతో రోజూ మాట్లాడుతున్నారు. నేతలకు ధైర్యం చెబుతున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని.. క్షేత్ర స్థాయిలో నేతలంతా అలర్ట్ గా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలి… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని.. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చేలా ప్రజల్లోకి వెళ్లాలంటూ హితభోద చేస్తున్నారు.
చంద్రబాబు.. ఇంత సీరియస్ గా జమిలి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారంటే.. మోదీ అంతరంగం తెలుసుకున్నారా? లేదా మోదీ ఎలాగైనా ఈసారి జమిలి ఎన్నికలను 2022లో నిర్వహిస్తారని చంద్రబాబుకు ముందే తెలిసిందా? అని టీడీపీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
This website uses cookies.