YSRCP : కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఆ నాలుగు నిజయోగకవర్గ ఎమ్మెల్యేల కంటే వారి వారసులే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. భవిషత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ సుపుత్రులను బరిలో దించి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి.. ఓ పద్ధతి ప్రకారం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ముందు వరుసలో ఉన్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్రెడ్డి. తన సుపుత్రుడిని ఎమ్మెల్యేగా చూడాలన్న కల సాకారం చేసుకొనేందుకు జయమనోజ్ రెడ్డిని రాజకీయ వారసుడిగా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసేశారు. నియోజకవర్గంలో అన్ని అంశాల్లోను జయమనోజ్ రెడ్డి తనదైన శైలిలో చొరవ చూపిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకుగా అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తూ సలహాలు ఇచ్చేస్తున్నారు. ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహాలన్నీ సాయి మనోజ్రెడ్డి రూపకల్పన చేసినట్లు సమాచారం. భారీ మెజారిటీతో 42 మంది కౌన్సిలర్ల గెలుపుకు కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఇదంతా చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్రెడ్డి తనయుడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమోనని పార్టీ క్యాడర్ లో బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
kurnool ysrcp mlas sons into active politics
ఇక మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా సాయిప్రసాద్ రెడ్డి మార్గాన్ని ఎంచుకున్నారు. తన తరువాత రాజకీయ వారసునిగా అన్న కుమారుడు ప్రదీప్కుమార్రెడ్డిని రంగంలో దింపుతున్నట్లు సమాచారం. బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీరెడ్డి ఉన్నా.. యాక్టివ్ రోల్ మాత్రం ప్రదీప్కుమార్రెడ్డి దేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రదీప్కుమార్రెడ్డితో చర్చించకుండా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముందడుగు వేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో 2024లో బాలనాగిరెడ్డి ప్లేస్లో ప్రదీప్రెడ్డి పోటీ చేస్తారేమోనని పార్టీ క్యాడర్ చెప్పుకుంటున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తన రాజకీయ వారసునికి త్వరలో పట్టంగట్టాలని చూస్తున్నారని కేడర్ చెబుతోంది. కుమారుడు నరసింహారెడ్డితో పలు గ్రామాల్లో గ్రామప్రజల సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన కుమారుడు జగన్ మోహన్రెడ్డిని రాజకీయాల్లో అరంగేట్రం కోసం తెగ ఆరాట పడిపోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దించాలని చూశారు. అయితే పార్టీ అధిష్టానం ఇందుకు ససేమిరా అనడంతో వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఎమ్మిగనూరులో జగన్మోహన్రెడ్డి తీరిక లేకుండా పర్యటిస్తూ బలం తగ్గకుండా చేసుకుంటున్నారు.
Brahmotsavams : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, రాజకీయ వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ప్రత్యేక యాప్ను…
RK Roja : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని…
Flipkart Freedom Sale : ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ Flipkart ఫ్రీడమ్ సేల్లో వినియోగదారులకు ఊహించని డీల్స్…
Kuppam Pulivendula : ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…
Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ…
Hyderabad Sperm Scam : సికింద్రాబాద్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా…
Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో కల్పిక నానా హంగామా…
This website uses cookies.