telangana congress party leaders not going well
AP Congress : ఆంధ్రప్రదేశ్ లో కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో ప్రక్షాళన ప్రారంభించనుంది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ తరహాలోనే ఫైర్ బ్రాండ్ పీసీసీ ఛీఫ్ ఎంపికతో పాటు పలు కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని నేతలకు సంకేతాలు పంపుతున్నారు. త్వరలో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీలో సీనియర్లతో ముందుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్లను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీ రాహుల్ గాంధీతో సమావేశానికి రావాలని వీరిని ఆహ్వానిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రతి నేతతో మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
congress party planning to get strenthen in andhra pradesh
ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను మార్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. శైలజా నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడం సాధ్యం కాదని భావిస్తున్న హైకమాండ్.. ఆయన స్ధానంలో రేవంత్ రెడ్డి తరహా నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడి, మళ్లీ పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని లీడ్ తీసుకోవాలని అధిష్టానం కోరే అవకాశముంది. ప్రస్తుతం రెడ్ల నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇందుకు కౌంటర్ గా కిరణ్ ను పీసీసీ ఛీఫ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై రాహుల్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీ సీనియర్లు ఏమంటారన్నదే కీలకంగా మారింది. ఇక గతంలో పీసీసీ ఛీఫ్ గా పనిచేసిన రఘువీరారెడ్డి .. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. తాజాగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే రఘువీరారెడ్డి.. చూపు వైసీపీవైపు ఉందంటూ గతంలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే రఘువీరారెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సైలెంట్ లో ఉన్న సీనియర్లు మళ్లీ కదలివస్తారో లేదో మాత్రం వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.