AP Congress : రేవంత్ రెడ్డి కంటే తోపు నాయకుడికి పీసీసీ పగ్గాలు.. ఏపీలో కాంగ్రెస్ ఇకనైనా బలోపేతం అవుతుందా?

Advertisement
Published by
Advertisement

AP Congress : ఆంధ్రప్రదేశ్ లో కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో ప్రక్షాళన ప్రారంభించనుంది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ తరహాలోనే ఫైర్ బ్రాండ్ పీసీసీ ఛీఫ్ ఎంపికతో పాటు పలు కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని నేతలకు సంకేతాలు పంపుతున్నారు. త్వరలో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీలో సీనియర్లతో ముందుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్లను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీ రాహుల్ గాంధీతో సమావేశానికి రావాలని వీరిని ఆహ్వానిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రతి నేతతో మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Advertisement

congress party planning to get strenthen in andhra pradesh

సాకేకు .. ఊస్టింగ్…

ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను మార్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. శైలజా నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడం సాధ్యం కాదని భావిస్తున్న హైకమాండ్.. ఆయన స్ధానంలో రేవంత్ రెడ్డి తరహా నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడి, మళ్లీ పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని లీడ్ తీసుకోవాలని అధిష్టానం కోరే అవకాశముంది. ప్రస్తుతం రెడ్ల నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇందుకు కౌంటర్ గా కిరణ్ ను పీసీసీ ఛీఫ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై రాహుల్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీ సీనియర్లు ఏమంటారన్నదే కీలకంగా మారింది. ఇక గతంలో పీసీసీ ఛీఫ్ గా పనిచేసిన రఘువీరారెడ్డి .. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. తాజాగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే రఘువీరారెడ్డి.. చూపు వైసీపీవైపు ఉందంటూ గతంలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే రఘువీరారెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సైలెంట్ లో ఉన్న సీనియర్లు మళ్లీ కదలివస్తారో లేదో మాత్రం వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement

Recent Posts

Tea With Biscuits : టీ టైమ్ లో బిస్కెట్లు తింటున్నారా అయితే ఈ చేదు నిజాలు తెలుసుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం..!

Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…

49 minutes ago

Ys Jagan : బ్రేకింగ్ : హుటాహుటిన డిల్లీ కి జగన్ , మోడీ నుంచి అర్జంట్  పిలుపు??

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

9 hours ago

INDIAN ARMY : GOOSEBUMPS NEWS : 2 లక్షల డ్రోన్లు రంగంలోకి దించిన రాజ్ నాథ్ సింగ్..!

INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…

11 hours ago

Revanth Reddy : CM రేవంత్ విలువ తెలుసుకున్న తెలంగాణా మంత్రులు

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…

12 hours ago

Modi Decisions : మతమార్పిడి చేస్తున్న వాళ్లకి మోడీ చావు దెబ్బ .. తిరుగులేని చట్టం

Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…

13 hours ago

Visakhapatnam Murder Case : అప్పుడు డ్ర‌మ్ము.. ఇప్పుడు ఫ్రిడ్జ్‌.. మీర‌ట్ ను మించిన వైజాగ్ స్టోరీ.. అస‌లేం జ‌రిగింది..!

Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…

15 hours ago

YS Jagan arrest : జగన్ త్వరలో అరస్ట్ ? బీజేపీ నుంచి అతిపెద్ద హింట్ !

YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…

16 hours ago

Hydroponics Farming : మట్టితో పనిలేకుండా వ్యవసాయం.. కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు మిత్రులు.. 35000 మందికి ట్రైనింగ్.. ‘హైడ్రోపోనిక్స్’ సక్సెస్ స్టోరీ ఇదే

Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…

17 hours ago

Director Raghavendra Rao : శ్రీదేవి గురించి తెలియని నిజాలు చెప్తూ ఏడ్చేసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు

Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…

19 hours ago

New Changes : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక మార్పులు .. లాభనష్టాల వివరాలివే .. !

New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…

20 hours ago

Gold Silver Rate 30 March 2026 : భారీగా పెరిగి, ఇప్పుడు స్థిరంగా పసిడి ధరలు.. ఈరోజు ధరలివే..!

Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

21 hours ago