
telangana lockdown
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మే 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రభుత్వం విధించింది. ముందుగా పది రోజులు అనుకున్నా.. ఆ తర్వాత లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించింది. లాక్ డౌన్ కు ఇవాళే చివరి తేదీ కావడంతో.. రాష్ట్ర కేబినేట్ ఇవాళ సమావేశమైంది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర కేబినేట్ సమావేశమై.. లాక్ డౌన్ పొడిగింపుపై, సడలింపు సమయంపై చర్చించింది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై కేబినేట్ చర్చించింది. అయితే.. ఇంకా తెలంగాణలో కేసులు తగ్గకపోవడంతో.. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
అయితే.. ప్రస్తుతం సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే ఉంది. అయితే కేవలం 4 గంటల్లో ఏవైనా పనులు చేసుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే.. ఏ పనీ చేయలేకపోతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలులోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో.. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. సడలింపు సమయాన్ని పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయాన్ని పెంచారు. దీంతో 7 గంటల పాటు లాక్ డౌన్ సడలింపు ఉంటుంది.
telangana lockdown
అయితే.. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు కానీ.. ఇతర నిత్యావసర సరుకులు కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 తర్వాత షాపులన్నీ బంద్ అయిపోతాయి. అయితే.. ప్రజలు మాత్రం తమ ఇంటికి వెళ్లడానికి మరో గంట అదనపు సమయాన్ని ఇచ్చింది ప్రభుత్వం. అంటే.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల లోపున ప్రజలంతా తమ ఇళ్లలోకి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే.. మధ్యాహ్నం 2 నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ మాత్రం కఠినంగా అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.