Revanth Reddy : చిన్నపిల్లలు నడిచే క్రమంలో టప్పటడుగులు వేస్తుంటారు. అప్పుడు చిన్నచిన్న దెబ్బలు తగలడం కూడా సహజమే. కానీ.. వాళ్ల లక్ష్యం ఏంటి.. సరిగ్గా నడవడం. పిల్లలకు నడవడం ఎవ్వరూ నేర్పించరు. వాళ్లంతట వాళ్లే నేర్చుకుంటారు. కాకపోతే మధ్యలో కొన్ని గాయాలు అవడం అనేది ఎంత మామూలో.. రాజకీయాల్లో రాణించాలన్నా కూడా మధ్య మధ్యలో అటువంటి గాయాలు సహజం. ఎదురుదెబ్బలు సహజం. అన్నింటికీ ఓర్చుకొని ముందుకు వెళ్తేనే రాజకీయాల్లో రాణిస్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగే వేరు. అందుకే.. రేవంత్ రెడ్డిని త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ వార్తలు వచ్చాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా రేవంత్ వైపే మొగ్గు చూపారని.. త్వరలోనే ఆయనకు ఇక పట్టాభిషేకమే అన్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇటీవల రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు ఫైల్ చేసింది. అది కూడా ప్రధాన నిందితుడిగా. ఓటుకు నోటు కేసులో అప్పట్లోనే రేవంత్ రెడ్డి అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ కేసులు నత్తనడకన సాగుతూనే ఉంది. కానీ.. తాజాగా ఆ కేసులో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డిని పేర్కొంటూ ఈడీ చార్జిషీటు దాఖలు చేయడంతో.. అసలు కథ మళ్లీ మొదటికొచ్చింది.
ఎప్పుడో ఆరేళ్ల కిందటి కేసు. ఇప్పుడు ఇంత సడెన్ గా ఎందుకు తెరమీదికి వచ్చింది. అదే ఇప్పుడు పెద్ద అనుమానం. నిజానికి.. రేవంత్ రెడ్డి అంటే పడని వాళ్లు.. తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ ఉన్నారు. తెలంగాణలో అయితే.. తన సొంత పార్టీ కాంగ్రెస్ లోనే తనకు శత్రువులు ఉన్నారు. చాలామంది సీనియర్ నేతలకు రేవంత్ రెడ్డి అంటే పడదు. అదే కొంప ముంచిందా? లేక టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న వైరం కారణంగా ఈ కేసును మళ్లీ తవ్వి తీశారా? అనేది తెలియనప్పటికీ.. రేవంత్ రెడ్డి రాజకీయ ఆశలపై మాత్రం ఈ చార్జిషీటు నీళ్లు చల్లినట్టే.
ఈసమయంలో రేవంత్ రెడ్డికి.. పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తే.. ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఎలా పీసీసీ చీఫ్ పదవిని ఇస్తారు అని సొంత పార్టీ నేతల నుంచే కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అలాగే.. ఇతర పార్టీలు కూడా అదే విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎటువంటి అడుగు వేస్తారు? అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది.. అనేది కూడా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.