Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. అంటే.. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ప్రజాపాలనలో రెండేళ్లు గడిచిపోయింది. ఇకనుంచి వచ్చే మూడేళ్లు కూడా ప్రభుత్వం, పార్టీపరంగా చాలా కీలకమైన దశలోకి ప్రవేశిస్తున్నట్టే. కారణం.. 2024లో ఎన్నికలు ఉన్నాయి. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలి. తన మార్క్, పొలిటికల్ చార్మ్ మళ్లీ ప్రజలకు తెలియాలి. అంటే.. తనతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తల పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఓట్లు వేయించుకోగలగాలి. ఇందుకు జగన్ పెద్ద కసరత్తే చేయాలి. అయితే.. పాలనతోపాటు పార్టీపై కూడా జగన్ ఓ కన్నేశారని.. నాయకుల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
జగన్ కేబినెట్ అంతా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. కొందరు సీనియర్లు.. యాభైల్లో ఉన్నవారైనా రాజకీయంగా మంచి వయసే. జగన్ కూడా నలభై ప్లస్ లో ఉన్నారు. ఇవన్నీ ప్రజలను ఆకట్టుకునే అంశాలే. తమను పాలించే నాయకులు కొత్తగా, ఎనర్జిటిగ్గా ఉంటే ప్రజలకు కూడా కిక్కే. 2019లో జగన్ గెలుపుకు ఇదొక స్ట్రాటజీ. ప్రస్తుత పాలన కూడా అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును కూడా జగన్ కేటగిరీలుగా విభజిస్తున్నారట. ప్రజల్లో ఉంటోంది ఎవరు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోందెవరు.. పార్టీని ప్రజల్లో నిలుపుతోంది ఎవరు.. అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారట. ఈ ప్రాతిపదికనే మిగిలిన మూడేళ్లు కూడా పరిశీలించి 2024 ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.
మంత్రివర్గంలో కూడా జగన్ మార్పులు చేస్తారు. రెండేళ్ల క్రితమే ఈ విషయం చెప్పేశారు. కొందరిని మొదట్లో పదవులిచ్చి సంతృప్తి పరచి.. తనను నమ్మినవారు.. మరింత కేపబిలిటీ ఉన్నవారికి మలివిడతలో పదవులిచ్చి వారితోనే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ప్లాన్ గా చెప్తున్నారు. ఈక్రమంలో ప్రజలకు మళ్లీ వైసీపీ కొత్తగా కనిపించేలా సరికొత్త కూర్పు ఉంటుందని అంటున్నారు. ఈక్రమంలో 100 2024 ఎన్నికల్లో టక్కెట్లు ఇవ్వడం కష్టమే అంటున్నారు. ప్రజలను ఆకర్షించిన ‘కొత్త’ అనే మంత్రంతోనే వెళ్తారట. టీడీపీలో కొత్తవారిని చంద్రబాబు ఆదరించడమే తక్కువ. దశాబ్దాల నాటి నాయకులతోనే ఆ పార్టీ ఉంది. ఈ అంశం కూడా జనం తనను మళ్లీ ఆదరించేలా చేస్తుందని జగన్ నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. మరి.. జగన్ ఆలోచనేంటో.. ఇందులో నిజమెంతుందో చూడాల్సి ఉంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.