Manasa Trust : బయటపడ్డ మాన్సాస్ ట్రస్ట్ ఈవో లేఖాస్త్రం

Advertisement
Published by
Advertisement

విజయనగరం : మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. రోజుకో కొత్త ట్విస్ట్ తో వెలుగులోకి వస్తోంది. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈవోగా చేయలేనంటూ వెంకటేశ్వరరావు రాసిన లేఖ బహిర్గతమవ్వడం సంచలనంగా మారింది. ఆయన లేఖలో పలు సంచలన విషయాలు ఉన్నాయి. ట్రస్ట్ లో ఉన్న, తన వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తూ గత నెల 31న ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ట్రస్ట్ వ్యవహారంలో ఓవైపు ప్రభుత్వ ఆదేశాలు, మరోవైపు ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఆదేశాలను పాటించలేక నలిగిపోతున్న ఈవో వెంకటేశ్వరరావు చేతులెత్తేసినట్టు లేఖ ద్వారా తెలుస్తోంది. తనను మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా తప్పించి మాతృ శాఖకు సరెండర్ చేయాలంటూ ఆయన తన లేఖలో ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు దేవాదాయ శాఖ మంత్రికి కూడా ఈమేరకు డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు.. గత నెల 31న అర్జీ పంపించారు.

Advertisement

ఆ లేఖ ఇప్పుడు బయట పడటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది మాన్సాస్ చైర్మన్ గా సంచయితా గజపతిరాజు ఉన్న సమయంలో అక్టోబర్ 22న ట్రస్ట్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే అక్టోబర్ వరకు ఆయనకు దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ట్రస్ట్ చైర్మన్ మారడం, అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో.. ఈ పది నెలల కాలంలోనే తాను మానసికంగా కుంగిపోయానని, వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

manasa trust chairman updates

 


బాధ్యతల నుంచి..ఇప్పటివరకూ తన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలిగానని..ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భూ లావాదేవీలతో తాను సతమతమైపోతున్నానని స్పష్టం చేశారు. తగినంత సిబ్బంది
లేకపోవడం, పని భారం వల్ల ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్ద లేకపోతున్నామని ఆయన వాపోయారు. అనారోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నానని, తనను తొందరలోనే తప్పించి మాతృ శాఖకు
సరెండర్ చేయాలని డి.వెంకటేశ్వరరావు లేఖ రాసారు.

గత కొన్నినెలలుగా.. అశోక్ గజపతిరాజు వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్టు సాగుతున్న ఈ వివాదంలో మాన్సాస్ ట్రస్ట్ ఈవో చాలా నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మాన్సాస్ ట్రస్ట్ వివాదం కొనసాగుతున్న క్రమంలో ఈ బాధ్యతలు నిర్వహించలేనంటూ.. ఆయన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ కి లేఖ రాసారు. మాన్సాస్ ట్రస్ట్ నుండి తనను తప్పించి, తిరిగి తనను రెవెన్యూ విభాగానికి పంపించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైత గజపతిరాజును నియమించింది.

Gowru Charitha Reddy tdp leader ycp party

 

ఈవో పై అశోక్ పిటిషన్ ..న్యాయ పోరాటం చేసిన అశోక్ గజపతిరాజు, కోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరింత ముదిరింది. ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మాన్సాస్ ట్రస్టులో కొన్నేళ్లుగా ఆడిటింగ్ జరగలేదని, అవకతవకలకు పాల్పడ్డారని, మాన్సాస్ ట్రస్ట్ భూములు టీడీపీ హయాంలో దొంగ జీవోలను జారీ చేసి అమ్ముకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో సంచయితా గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక ఉద్యోగుల జీతాల వ్యవహారం తలనొప్పిగా మారింది.

ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలను నిలిపేసారు.దీంతో అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ చైర్మన్ అయ్యాక ..ఆయనకు, మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు మధ్య వివాదం ముదిరింది. తన ఆదేశాలను ఈవో పట్టించుకోవడం లేదంటూ.. ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవో వెంకటేశ్వరరావు ట్రస్ట్ ఉద్యోగులకు సహకరించటం లేదని, జీతాలు కూడా ఇవ్వటం లేదని కోర్డులో పిటిషన్ వేశారు. చైర్మన్ ఆదేశాలను ఈవో పాటించాల్సిందే అంటూ కోర్టు కూడా పేర్కొంది. ఈవో వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హైకోర్టు ఆదేశాలను పాటించరా? అంటూ కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో అటు ప్రభుత్వానికి, ఈవోకు షాక్ తగిలింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ఈవో అశోక్ గజపతిరాజు పైనా, ఉద్యోగులపైనా.. తనపై దౌర్జన్యం చేసారంటూ ఈవో కేసులు పెట్టారు.

manasa trust chairman updates

 

ఇలా అనేక పరిణామాల నేపధ్యంలో.. మాన్సాస్ ట్రస్ట్ ఈవో అటు ప్రభుత్వ ఆదేశాలు, ఇటు చైర్మన్, మాన్సాస్ ఉద్యోగుల ఒత్తిడి మధ్య నలిగిపోతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం
ఏవిధంగా స్పందిస్తుందన్నదే కీలకంగా మారింది. ఈ కీలక పరిణామంపై వైసీపీ వర్గాలు మరోలా స్పందిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ పై సర్వాధికారాల కోసం
ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఈవోను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఈవో వెంకటేశ్వరరావు మాన్సాస్ట్రస్ట్ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించలేనని కోరుతూ ప్రభుత్వానికి లేఖ
రాశారంటున్నారు. ఇక టీడీపీ నేతలు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.. కారణమేదైనా మాన్సాస్ ట్రస్ట్ లో వివాదం కొనసాగుతున్న సమయంలో ఈవో తనను బదిలీ చేయాలని కోరడం ఆసక్తికర పరిణామమని కొంత మంది విశ్లేషిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Recent Posts

Modi : దోవల్ ని ఆ దేశం.. జై శంకర్ ని ఈ దేశం పంపించాడు .. మోడీ స్కెచ్ తెలిస్తే వెంట్రుకలు నిక్క బొడుచుకుంటాయి

Modi  : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…

3 hours ago

Vijaysai Reddy : విజయసాయి రెడ్డి కి చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..!

Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…

4 hours ago

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం బంపర్ గుడ్ న్యూస్ యాభై శాతం డిస్కౌంట్..!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…

6 hours ago

Amit Shah : మేము గెలిచిన మరుక్షణం వాళ్ళంతా జైల్లో.. అమిత్ షా..!

Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

7 hours ago

Ration Card : రేషన్ లబ్ధిదారులకు షాక్‌ .. ఇలా చేయకుంటే మీ రేషన్ కార్డు రద్దు .. వెంటనే ఈ పని చేయండి ..!

Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…

9 hours ago

Pithapuram Varma : పవన్ కళ్యాణ్ కి నమ్మలేని షాక్ ఇస్తూ పిఠాపురం నడిబొడ్డు లో వర్మ అతిపెద్ద సంచలనం..!

Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…

10 hours ago

Abhishek Sharma : అభిషేక్ శర్మ బ్యాట్‌ తుఫాన్ .. పవర్ ప్లేలో కొత్త చరిత్ర.. కానీ 24 గంటల్లో మళ్ళీ సవాల్ ..!

Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…

12 hours ago

Power Bill : కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.. అయితే వాట్సాప్‌లో క్షణాల్లోనే ఇలా కంప్లైంట్ చేయొచ్చు..!

Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…

13 hours ago

Watermelon : పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా ?.. అయితే మీ జీర్ణవ్యవస్థ ఖతమే.. !

Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…

16 hours ago

Sharbat : వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే ఈ అద్భుతమైన షర్బత్ .. ఆరోగ్య ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…

18 hours ago

YS jagan : జగన్ ‘ప్లాన్ బి’ సిద్ధం.. ధర్మాన ఒత్తిడికి చెక్ పెట్టేలా శ్రీకాకుళంలో కొత్త నాయకత్వ సమీకరణాలు!

YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…

1 day ago

IPAC : బొగ్గు కుంభకోణం లింకులు.. ఏపీ నిధుల మళ్ళింపు: ఐప్యాక్ చుట్టూ ఈడీ వల

IPAC  : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…

1 day ago