Manchu Lakshmi : మెగా ఇంట్లో మంచు లక్ష్మి .. అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో వైరల్ ..!
Manchu Lakshmi : మెగా ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటారు. మొన్న దీపావళికి మెగా ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్ లో మంచు మనోజ్ సతీసమేతంగా పాల్గొన్నారు. ఇక మంచు లక్ష్మి అయితే మెగా వేడుకలో బాగా సందడి చేసినట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇలా ఈవెంట్లో సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి కూడా నెట్టింటా వైరల్ గా మారుతుంటాయి. అంతేకాకుండా మంచు లక్ష్మి ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటారు. అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా తన లైఫ్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకారా కు ఇది మొదటి పండుగ కావడంతో పెద్ద ఎత్తున దీపావళిని జరిపినట్లుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ సతీసమేతంగా వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అఖిల్ చైతు ఇలా అందరూ వచ్చారు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్, మంచు లక్ష్మి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి ఈవెంట్లో అందరితోనూ సెల్ఫీలు దిగినట్లుగా ఉంది. చిరంజీవి, వెంకటేష్ లతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలన్నీ ఒక ఎత్తు అయితే అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో ఇంకొక ఎత్తులా ఉంది. మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు పెట్టిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మంచు లక్ష్మికి, అల్లు శిరీష్ కి మధ్య మంచి సన్నిహిత్యం ఉన్నట్లుగా ఉంది. అందుకే ఇలా ఫోటో దిగినట్లుగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు మంచు లక్ష్మి షేర్ చేయడంతో అవి ఇలా వైరల్గా మారాయి. ఇకపోతే మంచు లక్ష్మి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓటీటీలో కూడా సందడి చేస్తున్నారు. ఆహా కోసం చేసిన స్పెషల్స్ మధ్యలోనే ఆగిపోయింది. ఓటిటిలో ఆమె చేసే స్పెషల్ షోలు అంతగా ఆకట్టుకోలేనట్లుగా ఉన్నాయి అనిపిస్తుంది.
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
This website uses cookies.