#image_title
Chandra Mohan ; టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గారు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నవంబర్ 11న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ గారి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన వయసు 82 ఏళ్లు. ఈయన తెలుగులో హీరోగా 175 సినిమాలలోకి పైకి నటించారు. హీరో గానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన మొత్తం 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మరిచిపోలేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక చంద్రమోహన్ భార్య జలంధర తెలుగు రచయిత్రి. ఇక వీళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కూతురు మధుర మీనాక్షి సైకాలజిస్ట్, రెండవ కూతురు మాధవి డాక్టర్ .చంద్రమోహన్ తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయకుండా మంచి చదువులు ఇప్పించి మంచి హోదాకి వచ్చేలా చేశారు. ఇక చంద్రమోహన్ చివరిగా ‘ కోతల రాయుడు ‘ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కంటే ముందు చంద్రమోహన్ సినిమాలు చేయడంలో కాస్త స్లో అయ్యారు. వయసు పైబడటంతో ఈ మధ్యనే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 11న హృద్రోగ సమస్యతో అపోలో ఆసుపత్రిలో చేరి చివరికి తుదిశ్వాస విడిచారు.
అయితే చంద్రమోహన్ కి సంబంధించి వీలునామా ఒకటి బయటపడినట్లుగా తెలుస్తుంది. అందులో ఆయన ఆస్తుల గురించి ఉన్నట్లు తెలిసింది. చంద్రమోహన్ కి హైదరాబాదు చెన్నైలో కూడా భారీగా స్థిర ఆస్తులు ఉన్నాయని, ఈ మొత్తం ఆస్తుల విలువ 300 కోట్లకు పైనే ఉంటుందని తెలిసింది. అయితే ఆయన రాసిన వీలునామాలో ఆస్తి మొత్తం తమ కూతుర్లకు పంచి పెట్టాలని రాశారని తెలిసింది. ఇక తను మరణించిన తర్వాత ఎవరైతే తనకు కొరివి పెడతారో వారికి ఆస్తి లో 20 శాతం అందివ్వాలని రాసి ఉంది. అయితే ఆయనకి కొడుకులు లేరు అన్న సంగతి తెలిసిందే. ఈ వీలునామాలో ఎంత నిజం ఉన్నదో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.