Minister Ambati Rambabu : జనాన్ని చంపింది కాక జీవోపై రగడా.. మంత్రి అంబటి రాంబాబు..!!

Minister Ambati Rambabu ; పేద ప్రజలను చంపింది కాక జీవోపై రగడ చేస్తున్న చంద్రబాబు రంకెలకు బెదిరేది లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల ప్రాణలతో చెలగాటం ఆడటం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనలను మరిపించేందుకే చంద్రబాబు జీవో పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి అంబటి మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-1ని తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు ర్యాలీలు పెట్టుకునేందుకు ప్రభుత్వం ఎక్కడా అడ్డు చెప్పడం లేదని.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే జీవోను తీసుకు వచ్చిందని స్పష్టం చేశారు.

హైవేలపై, ఇరుకుసందుల్లో పెట్టి ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకుని చూడాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు పర్మిషన్ తో నిర్ణీత ప్రాంతంలో సభలు పెట్టుకోవచ్చని, దానికి అధికారులు పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు. అంతేకానీ తనను అడ్డుకోవడం కోసమే ప్రభుత్వం జీవో తీసుకువచ్చినట్లు కుప్పంలో హైడ్రామాకు చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. అధికారం కోసం ఎంతమందినైనా చంపేందుకు వెనకాడడని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పనిని వైసీపీ ప్రభుత్వం చేస్తుందని వివరించారు. జీవో కేవలం ప్రతిపక్షానికే కాదని, అందరికీ వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీనికి ఎవరూ అతీతులు కారన్నారు. భావోద్వేగ రాజకీయాలకు తప్ప శాశ్వత రాజకీయాలకు చంద్రబాబు పనికిరాడని విమర్శించారు.

Minister Ambati Rambabu About on Chandrababu

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేవలం దుప్పట్లు పంచేందుకు మీటింగ్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ జీవో ఉద్దేశం ప్రజలకు రక్షణ కల్పించడమే తప్ప, ఎలాంటి అదనపు నియంత్రణలు లేవని స్పష్టం చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే రూ. 2 లక్షలు ఇవ్వడం జరిగిందని, వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నీ విధాలా ఆదుకుంటుందని అన్నారు. సీఎం జగన్‌ గురించి బాబు అవాకులు, చవాకులు మాట్లాడటం చూస్తుంటే బాబుకు

పిచ్చెక్కిందేమో అనిపిస్తోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పిచ్చికుక్క ఎలా అరుస్తుందో అలా బాబు అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా దాపురించాడని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి జనం ప్రాణాలు ముఖ్యమని, అందుకే జీవో తెచ్చామని, అంతేకాని బాబును, వారాహిని, దత్తపుత్రుడి తమ్ముడిని(యువగళం) ఆపడానికి కాదని రాంబాబు చెప్పారు. జగన్‌ యాత్రల్లో ఎక్కడా అపశ్రుతులు దొర్లలేదని, బాబు యాత్రల్లో మాత్రమే రక్తపు మరకలంటుతున్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Recent Posts

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

34 minutes ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

2 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

3 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

4 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

5 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

6 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

15 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

16 hours ago