minister botsa satyanarayana gives clarity on ap capital
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రాజధానిగా అమరావతి నే కొనసాగించాలిసిందే అంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మాత్రం మూడు రాజధానులు మాటనే చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ మరో సారి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని అంటూనే ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మూడు మూడు రాజధానులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.కేవలం కొంత మంది అభిప్రాయం కోసం.
. కొంత మంది అభివృద్ధి కోసం కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు తీసుకు రావాలని కోరుకుంటున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. టీడీపీ స్వార్ధ రాజకీయం కోసం రాష్ట్రం యొక్క భవిష్యత్తు ని తాకట్టు పెడుతోంది అంటూ మంత్రి ఆరోపించాడు. కేవలం అమరావతిలో ఉన్న వాళ్ళ బంధువుల మరియు సన్నిహితుల ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజధాని డ్రామా ఆడుతున్నారు.రాష్ట్ర అభివృద్ది మరియు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజల గురించి వారికి పట్టదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై మంత్రి ఆరోపణలు చేశారు.
minister botsa satyanarayana gives clarity on ap capital
చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం నాయకులు అమరావతి విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తాము అనుకున్నట్లుగా మూడు రాజధానులు తీసుకు వస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టు తీర్పుపై న్యాయపరమైన చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. భవిష్యత్తు ప్రజల అవసరాల నిమిత్తం రాజధాని నిర్మాణం చేయడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని.. మూడు రాజధానులు అయినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
This website uses cookies.