ఏపీ బెస్ట్ మినిస్ట‌ర్‌… అందరు మంత్రులు ఆయన్ను ఫాలో అవ్వాలంటున్న సీఎం జగన్‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

ఏపీ బెస్ట్ మినిస్ట‌ర్‌… అందరు మంత్రులు ఆయన్ను ఫాలో అవ్వాలంటున్న సీఎం జగన్‌

Ys jagan ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో పలువురు మంత్రులపై జనాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సీనియర్లు అని.. పార్టీ కోసం పని చేసిన వారంటూ కొందరికి మంత్రి పదవులను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చాడు. వారిలో కొందరు ఇప్పుడు ఏమాత్రం సీఎం కు సంతృప్తికరంగా విధులు నిర్వహించడం లేదు. మంత్రులుగా వారు కనీసం వారి నియోజక వర్గంలో కూడా మెప్పించలేక పోతున్నారు. ఇక రాష్ట్రంలో వారు ఎలాంటి […]

 Authored By himanshi | The Telugu News | Updated on :24 May 2021,2:45 pm

Ys jagan ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో పలువురు మంత్రులపై జనాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సీనియర్లు అని.. పార్టీ కోసం పని చేసిన వారంటూ కొందరికి మంత్రి పదవులను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చాడు. వారిలో కొందరు ఇప్పుడు ఏమాత్రం సీఎం కు సంతృప్తికరంగా విధులు నిర్వహించడం లేదు. మంత్రులుగా వారు కనీసం వారి నియోజక వర్గంలో కూడా మెప్పించలేక పోతున్నారు. ఇక రాష్ట్రంలో వారు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ మంత్రులను బర్తరఫ్‌ చేస్తే బెటర్ అన్నట్లుగా సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అందరిలోకి ఈయనే బెటర్..

పలువురు మంత్రులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పై జగన్ మోహన్‌ రెడ్డి చాలా నమ్మకంతో ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా జగన్‌ ను ఒప్పించి ఏదో ఒకటి ప్రజల కోసం కొత్తగా చేసేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు.

minister kurasala kannababu is the best in cabinet

minister kurasala kannababu is the best in cabinet

తన నియోజక వర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులతో పోల్చితే కన్నబాబు బెటర్ అన్న ఫీలింగ్‌ కు సీఎం వచ్చాడంటూ ఆ పార్టీ నాయకులు స్వయంగా కొందరు అంటూ ఉన్నారు. మొన్నటి బడ్జెట్ లో కూడా వ్యవసాయంకు మెజార్టీ వాటా ఇవ్వాల్సిందే అంటూ జగన్ వద్ద పోరు పెట్టాడట. అందుకే కేబినెట్‌ మొత్తంలో కన్నబాబు బెస్ట్‌ అన్న టాక్ వినిపిస్తుంది.

ఆయన్ను ఫాలో అవ్వండి..

మంత్రిగా కన్నబాబు విధి నిర్వహణలో అన్ని విధాలుగా బెటర్‌ గా ఉన్నాడని అందుకే ఆయన్ను మంత్రులు అంతా కూడా ఫాలో అవ్వాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నాడట. ఇప్పుడు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తేనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామనే అభిప్రాయంను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క మంత్రి కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఈ సందర్బంగా సీఎం జగన్‌ హెచ్చరించాడట.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది