Minister Roja comments on chandrababu naidu
Minister Roja : ప్రతిపక్ష నాయకుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాడు. సామాన్యులపై ధరల భారం వేస్తూ బాదుడే బాదుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు పలువురు మంత్రులు గట్టి సమాధానం ఇచ్చారు. గతంలో మీ హయాంలో ఉన్న బాదుడు గురించి మర్చి పోయారా బాబు గారు.. మీరు మర్చి పోయినా కూడా జనాలు ఆ బాదుడు గురించి మర్చిపోలేదు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారని మంత్రులు ఎద్దేవ చేస్తున్నారు.
మంత్రి రోజా మాట్లాడుతూ.. జగన్ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా బాదుడు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది అన్నట్లుగా రోజా వ్యాఖ్యలు చేశారు. గతంలో వ్యాట్.. ప్రైవేటీకరణ.. విద్యుత్ చార్జీలు ఇలా ప్రతి విషయంలో కూడా సామాన్యులను బాదినది చంద్రబాబు కాదా అంటూ ఆమె ప్రశ్నించారు.
Minister Roja comments on chandrababu naidu
బాబు మరియు జగన్ పరిపాలనలో జరిగిన అభివృద్ది మరియు సంక్షేమం గురించి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని భావించారు. అందుకోసం చర్చలు కూడా జరిపారు. కాని నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకుని లాభాల్లోకి తెచ్చిన ఘనత జగన్ ప్రభుత్వంది అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచిన సమయంలో రైతులు ఆందోళన చేస్తుండగా కాల్చి చంపిన ప్రభుత్వం మీది కాదా.. ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా జగన్ అన్న పరిపాలన గురించి చంద్రబాబు కు మాట్లాడే అర్హత లేదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.