minister roja comments on tdp chief chandrababu
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా తన కొడుకు నారా లోకేశ్ వల్లనే చంద్రబాబుకు పెద్ద ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తారకరత్న చావు బతుకుల మధ్య ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరడానికి, చావు బతుకుల మధ్య ఉండటానికి నారా లోకేశ్ అనే లెగే ప్రధానం కారణం అంటూ నారా లోకేశ్ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన వల్లే అంతగా బాధపడుతున్న తారకరత్నను కనీసం పరామర్శించే తీరిక కూడా నారా లోకేశ్ కు లేకుండా పోయిందా అంటూ మంత్రి రోజా ధ్వజమెత్తారు. వైజాగ్ లో మీడియాతో మాట్లాడిన రోజా పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక సైకో..
Minister Roja comments on chandrababu naidu
ఆయన కొడుకు లోకేశ్ ఒక ఐరెన్ లెగ్. లోకేశ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. లోకేశ్ అడుగు పెట్టగానే.. రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. లోకేశ్ ఎమ్మెల్సీ అయి అసెంబ్లీలో అడుగు పెట్టాడో లేదో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు వచ్చాయి. యువగళం పోస్టర్ ను రిలీజ్ చేస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజే తారకరత్న ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన్ను పరామర్శించడానికి కూడా లోకేశ్ కు టైం లేదు అంటూ మంత్రి రోజా సీరియస్ అయ్యారు.
minister roja comments on tdp chief chandrababu
సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నారా లోకేశ్ కు లేదని మంత్రి రోజా మండిపడ్డారు. పాదయాత్ర తొలి రోజే ఆయన ప్రసంగాన్ని అందరూ చూశారని, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తి నాయకుడు అవుతాడా? నారా లోకేశ్ కు జగన్ కు ఎలాంటి పోలిక లేదు. తన తండ్రి ఆశయాల సాధన కోసం, సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి రాగానే.. వచ్చిన మూడేళ్లలోనే 98 శాతం హామీలు పూర్తి చేశారు అని మంత్రి రోజా స్పష్టం చేశారు.
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
This website uses cookies.