mlc jeevan reddy shocking comments over ktr becoming as chief minister of telangana
KTR : తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ కు త్వరలోనే సీఎం కేసీఆర్ పట్టాభిషేకం చేయబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఈ విషయంలోనూ పెద్ద యుద్ధమే జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఇతర నాయకులు మాత్రం.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందే. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.. అంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
mlc jeevan reddy shocking comments over ktr becoming as chief minister of telangana
కానీ.. కొందరు ప్రతిపక్ష నేతలు మాత్రం కేటీఆర్ ను ముఖ్యమంత్రిని ఎట్లా చేస్తారు? ఆయన వద్దు అని కొందరు.. ఇంకొందేమో.. ఆయన ముఖ్యమంత్రికి అర్హుడు అయినా కూడా వేరే మంత్రిని ముఖ్యమంత్రిని చేయాలంటూ సలహాలు ఇస్తున్నారు.
congress mlc jeevan reddy
తాజాగా ముఖ్యమంత్రి అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం పదవికి కేటీఆర్ అర్హుడు అయినప్పటికీ… కేటీఆర్ కన్నా.. మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేస్తే బెటర్.. అంటూ స్పష్టం చేశారు.
telangana minister etela rajender
తెలంగాణలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకూడదంటే… కేటీఆర్ కు బదులు ఈటలను ముఖ్యమంత్రిని చేయాలి. కొనుగోలు కేంద్రాల గురించి, వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడిన ఈటలకు అభినందనలు. గెలవగానే మేం అది చేస్తాం.. ఇది చేస్తాం.. పసుపు బోర్డు తెస్తాం.. అని చెప్పిన అర్శింద్ ఎక్కడున్నారు? అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేసీఆర్ కు జీవన్ రెడ్డి లేఖ రాశారు. అప్పట్లో ఓ కింటా పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది.. ఇప్పుడు తులం బంగారం విలువ 50 వేలకు పైన ఉంది. కానీ.. పసుపు మాత్రం కింటాకు 6 వేలకే పడిపోయింది. పసుపు బోర్డు గురించి.. అటు రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు కేంద్ర ప్రభుత్వం.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.