
Nadendla Manohar : చంద్రబాబు పై కోపంగా ఉన్న నాదెండ్ల మనోహర్..!
Nadendla Manohar : ఏపీలో మరో 80 రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక పొత్తు అన్నాక అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. వచ్చిన సమస్యలను పొత్తు పార్టీకి సొంత పార్టీ కి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధినేతపై ఉంటుంది. ఇక సీట్ల విషయంలో జనసేన, టీడీపీ మధ్య పరిస్థితి వేరేలా ఉంటుంది. 2019లో తెనాలిలో ఆళ్లపాటి రాజా 70వేల ఓట్లు సాధించి ఓడిపోయారు. అదే ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేసి 30 వేల ఓట్లు సాధించి ఓడిపోయారు. అన్నా బత్తుల శివకుమార్ ఆ ప్రాంతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు శివ కుమార్ ను ఓడించాలంటే టీడీపీ, జనసేన నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేయాలి.
అయితే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టారు. ఇక ఆళ్లపాటి రాజా కూడా టీడీపీ నుంచి తనకు కచ్చితంగా తెనాలిలో సీటు కావాలని పట్టుబట్టారు. సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తెల్చి చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇస్తే తెనాలిలో ఆళ్లపాటి రాజా హవా, పవర్ తగ్గుతుంది. మళ్లీ ఆయన సాధించుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఈ అంశంలో ఆళ్లపాటి రాజా సీరియస్ గా ఉన్నారని, ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి ఓట్లు చీల్చడానికైనా రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ కి సీటు ఇస్తే ఒప్పుకోనని ఆళ్లపాటి రాజా సీరియస్గా చెప్పారు. ఇక మెతక స్వభావం అయినా నాదెండ్ల మనోహర్ ఇలాంటి తలనొప్పులు నాకు వద్దు అని జనసేనకి రాజీనామా చేస్తానని, పోటీ చేస్తే తెనాలి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ కి తేల్చి చెప్పారట.
జనసేన కి ముఖ్య నాయకుడు లో నాదెండ్ల మనోహర్ ఒకరు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ని వదులుకోరు. కానీ చంద్రబాబు నాయుడు ఆళ్ళపాటి రాజా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు పై సీరియస్ గా ఉన్నారు. తెనాలి నుంచే పోటీ చేస్తానని లేదంటే జనసేన కి రాజీనామా అయినా చేస్తానని నాదెండ్ల మనోహర్ పట్టు బట్టారు. దీంతో తెనాలి సీటు విషయంలో టీడీపీ కి జనసేన కి పెద్ద తలనొప్పిగా మారింది. సీట్ల విషయంలో టీడీపీ, జనసేన కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఎలా సర్దుకుంటారో చూడాలి. మరోవైపు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రకటిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేశారు ఇప్పటి వరకు కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ తొలి జాబితా విడుదల కాలేదు.
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
This website uses cookies.