Nadendla Manohar : చంద్రబాబు పై కోపంగా ఉన్న నాదెండ్ల మనోహర్..!
Nadendla Manohar : ఏపీలో మరో 80 రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక పొత్తు అన్నాక అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. వచ్చిన సమస్యలను పొత్తు పార్టీకి సొంత పార్టీ కి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధినేతపై ఉంటుంది. ఇక సీట్ల విషయంలో జనసేన, టీడీపీ మధ్య పరిస్థితి వేరేలా ఉంటుంది. 2019లో తెనాలిలో ఆళ్లపాటి రాజా 70వేల ఓట్లు సాధించి ఓడిపోయారు. అదే ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేసి 30 వేల ఓట్లు సాధించి ఓడిపోయారు. అన్నా బత్తుల శివకుమార్ ఆ ప్రాంతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు శివ కుమార్ ను ఓడించాలంటే టీడీపీ, జనసేన నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేయాలి.
అయితే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టారు. ఇక ఆళ్లపాటి రాజా కూడా టీడీపీ నుంచి తనకు కచ్చితంగా తెనాలిలో సీటు కావాలని పట్టుబట్టారు. సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తెల్చి చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇస్తే తెనాలిలో ఆళ్లపాటి రాజా హవా, పవర్ తగ్గుతుంది. మళ్లీ ఆయన సాధించుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఈ అంశంలో ఆళ్లపాటి రాజా సీరియస్ గా ఉన్నారని, ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి ఓట్లు చీల్చడానికైనా రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ కి సీటు ఇస్తే ఒప్పుకోనని ఆళ్లపాటి రాజా సీరియస్గా చెప్పారు. ఇక మెతక స్వభావం అయినా నాదెండ్ల మనోహర్ ఇలాంటి తలనొప్పులు నాకు వద్దు అని జనసేనకి రాజీనామా చేస్తానని, పోటీ చేస్తే తెనాలి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ కి తేల్చి చెప్పారట.
జనసేన కి ముఖ్య నాయకుడు లో నాదెండ్ల మనోహర్ ఒకరు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ని వదులుకోరు. కానీ చంద్రబాబు నాయుడు ఆళ్ళపాటి రాజా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు పై సీరియస్ గా ఉన్నారు. తెనాలి నుంచే పోటీ చేస్తానని లేదంటే జనసేన కి రాజీనామా అయినా చేస్తానని నాదెండ్ల మనోహర్ పట్టు బట్టారు. దీంతో తెనాలి సీటు విషయంలో టీడీపీ కి జనసేన కి పెద్ద తలనొప్పిగా మారింది. సీట్ల విషయంలో టీడీపీ, జనసేన కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఎలా సర్దుకుంటారో చూడాలి. మరోవైపు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రకటిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేశారు ఇప్పటి వరకు కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ తొలి జాబితా విడుదల కాలేదు.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.